Breaking News

అనుమానం పెనుభూతమై.. భార్యను గొంతు నులిచి చంపేసిన భర్త


కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను కిరాతకంగా చంపేసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. మండలంలోని పెద్దనేలటూరు గ్రామానికి చెందిన చాకలి సూరికి అదే గ్రామానికి చెందిన అడివమ్మ(28)తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరు కుల వృత్తితో పాటు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సూరి ఆమెను వేధిస్తున్నాడు. Also Read: గ్రామంలోని పలువరు వ్యక్తులతో ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టి హింసించేవాడు.దీనిపై ఇటీవలే పెద్దల మధ్య పంచాయతీ కూడా జరిగింది. అప్పటినుంచి సూరి భార్యతో సఖ్యతగానే ఉన్నాడు. అయితే ఇటీవల ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లాలని సూరి నిర్ణయించుకున్నాడు. అయితే తాను ఊరు విడిచి రానని అడివమ్మ భర్తకు తెగేసి చెప్పింది. దీంతో సూరి ఒక్కడే వేరే ప్రాంతానికి వలస వెళ్లి అప్పుడప్పుడు ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్య ప్రవర్తనపై అతడికి అనుమానం రెట్టింపైంది. Also Read: అక్రమ సంబంధం కోసమే భార్య ఊరు విడిచి వచ్చేందుకు నిరాకరించిందని బలంగా నమ్మాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో సూరి ఆగ్రహానికి గురయ్యాడు. ఆవేశంతో భార్య గొంతు నులిమాడు. ఊపిరాడకపోవడంతో అడివమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో సూరి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అడివమ్మ తండ్రి రాముడు ఫిర్యాదు మేరకు ఎస్సై హనుమంతరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By May 05, 2020 at 07:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kurnool-man-brutally-killed-wife-over-suspects-illicit-affair/articleshow/75545467.cms

No comments