గాడ్సే-గాంధీ వివాదం: నాగబాబుకి అండగా ఫ్యాన్స్.. కుక్కలు అలాగే మొరుగుతాయ్ అన్నయ్యా అంటూ..
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/75858531/photo-75858531.jpg)
ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. తమ అభిప్రాయాన్ని వ్యక్త పరచడానికి అడ్డంకులూ లేవు. అయితే కులం, మతం, దేశం, దేశాన్ని పాలించిన గ్రేట్ లీడర్స్ విషయంలో నోటికి వచ్చినట్టు మాట్లాడి.. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మాత్రం ఇదిగో ఇలాగే వివాదాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. జాతి పిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను నిజమైన దేశ భక్తుడు అంటూ మెగా బ్రదర్, జనసేన నాయకుడు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మే 19న పుట్టిన రోజు సందర్భంగా RIP గాడ్సే అంటూ నాగబాబు సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కదా అనేది చర్చానీయాంశం. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే.. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ పోస్ట్ పెట్టారు నాగబాబు. గాంధీని చంపిన గాడ్సే.. నాగబాబుకి దేశభక్తుడిగా కనిపించాడా?? తాను అనుకున్నది చేశాడు.. అభినందించాలి అన్న రీతిలో నాగబాబు పోస్ట్ పెట్టడంపై దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. అయితే తనను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ నాగబాబు నష్టనివారణ చర్యలు చేపడుతూ.. సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం. ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’ అంటూ వివాదానికి ముగింపుపలికే ప్రయత్నం చేశారు నాగబాబు. అయితే మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడని కొనియాడిన సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు నాగబాబుపై కేసు నమోదైంది. ఉస్మానియా యూనివర్సీటీ (ఓయూ) పోలీస్ స్టేషన్లో టీపీసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఇష్యూలో నాగబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో ఆయనకు అండగా నిలిచారు మెగా ఫ్యాన్స్, జనసైనికులు. ‘దయచేసి నన్ను అర్థం చేసుకోండి’ అంటూ నాగబాబు పెట్టిన పోస్ట్పై స్పందిస్తూ.. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు ఇందులో తప్పేం లేదు.. నూటికి నూరు శాతం కరెక్ట్గా మాట్లాడారు. నిజం నిప్పులాంటిది ఇలాగే కాలుతుంటుంది’ అంటూ పలువురు మెగా ఫ్యాన్స్ నాగబాబుకి మద్దతు ప్రకటిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నాగబాబు వాదనను సమర్ధిస్తూ జనసైనికులు పెట్టిన కామెంట్స్లో కొన్నింటిని చూద్దాం.. ✦ Anil Kumar Vodnala నిజం సూది లాంటిది నాగబాబు గారు ఎలాగైనా బైటకు వస్తుంది. కానీ గాడ్సే గారి వైపు నుండి ఆలోచించే వారు తక్కువ ఆయన మరణ వాగ్మూలం చదివినవారు. ఎవరైనా ఆయన్ని సమర్దిస్తారు. ✦ Vikas Macharla సార్ మీరు అసలు బాధ పడాల్సిన విషయమే కాదు..మీరు తప్పు మెసేజ్ ఏ పెట్టలేదు..కొంత మంది అలానే ఉంటారు..మీరు నిజాలను ఇలానే చెప్పండి. ✦ Vasupalli Venu ఈ దేశం ఎన్నో దేశ ద్రోహి కుక్కలు ఉన్నాయి, అవి అలానే మొరుగుతాయి, మీరు అవన్నీ పట్టించుకోకుండా మీరు ఇలానే ఉండండి సర్ ✦ Kschrao-suresh Surya Chandra Rao అందరికి భయం. మీకు అది లేదు అంతే అంతకు మించి ఇందులో మీరు విచారం వ్యక్తం చేయవలిసిన అవసరం లేదని నా అభిప్రాయం ✦ సవరం దినేష్ నాయుడు.. ‘అన్నయ్య ముర్ఖులు మారరు. మీరు నిజం వైపు ఉన్నారు. జై హింద్. ✦ Paparao Bommali అందరూ బ్రష్టు పట్టిన చరిత్ర చదివి అందులోనే జీవిస్తున్నారు. నిజాలు చాలా చేదుగా ఉంటాయి. కానీ తప్పదు. చరిత్ర పుస్తకాలు మార్చే సమయం దగ్గరలోనే ఉంది. మీరు మంచిగా చెప్పారు. ✦ Madhupraveen Griddaluru అంత వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు ఏమి తప్పుగా మాట్లాడలేదు. ✦ Venkat Naidu సార్ మీరు మాట్లాడిన దాంట్లో తప్పేముంది, గాడ్సే మంచి దేశభక్తుడు. ✦ Ambati Malli గాంధీ గొప్పవారే కానీ ఆయనను గొప్ప వాడిని చేసింది గాడ్సే నే తెలుసా... అని నేటి రాజకీయ నాయకుల్లాగా చెప్పల్లేక పోయారు.అందువల్ల మిమ్మల్ని కొందరు విమర్శించవచ్చు.దానికి సంజాయిషీ ఇవ్వాల్సిన పని లేదు. మరిన్ని కామెంట్స్.. ఈ పోస్ట్లో చూడొచ్చు..
By May 21, 2020 at 08:03AM
No comments