Breaking News

పిన్నితో అక్రమ సంబంధం.. అడ్డు చెప్పిందని భార్య చంపేసి కట్టుకథ


వావి వరుసలు మరిచి పిన్ని వరుసయ్యే మహిళతో పెట్టుకున్న ఓ కామాంధుడు కట్టుకున్న భార్యనే కిరాతకంగా చంపేసిన ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో వెలుగుచూసింది. నిడుమోలు గ్రామానికి చెందిన కోట దుర్గారావు అనే వ్యక్తితో మరియమ్మకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. దుర్గారావుకు పిన్ని అయిన దేవనబోయిన ఎల్లమ్మ భర్తను వదిలేసి ఏలూరు నుంచి వచ్చి తన అక్క ఇంట్లోనే కొంతకాలంగా ఉంటోంది. ఈ క్రమంలోనే పిన్నితో దుర్గారావుకు సాన్నిహిత్యం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. దుర్గారావు, ఎల్లమ్మ అన్యోన్యంగా ఉండటాన్ని చూసి మరియమ్మ భర్తను నిలదీసింది. ఈ విషయంపై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న భార్య మరియమ్మను చంపేయాలని దుర్గారావు నిర్ణయించుకున్నాడు. ఈనెల ఆరో తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిద్రబోతున్న భార్య గొంతు నులిమి చంపేసి కడుపు నొప్పితో చనిపోయిందని అందరినీ నమ్మించాడు. మరియమ్మ తల్లిదండ్రులు తమ కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమె కడుపునొప్పితో చనిపోలేదని, హత్యకు గురైందని వెల్లడైంది. Also Read: అవనిగడ్డ డీఎస్పీ రమేశ్‌రెడ్డి ఆదేశాలతో కూచిపూడి పోలీసులు మరియమ్మ భర్త దుర్గారావు, అత్తమామలు కోట శ్యామల, రామస్వామి, చిన అత్తమామలు యాదమ్మ, పోతురాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దుర్గారావుతో అక్రమ సంబంధం పెట్టుకున్న అతడి పిన్ని ఎల్లమ్మ పరారీలో ఉందని, ఆమె కోసం గాలిస్తున్నట్ల పోలీసులు తెలిపారు. Also Read:


By May 21, 2020 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-in-krishna-district-over-illegal-affair-with-aunty/articleshow/75861274.cms

No comments