Breaking News

అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని మాజీ ప్రియురాలిపై హత్యాయత్నం


చాలాకాలం పాటు కొనసాగిన అక్రమ సంబంధంలో విరామం వచ్చింది. అయితే ప్రియుడు మళ్లీ ఆమెతో సహజీవనం చేయడానికి ఉత్సాహం చూపిస్తుండగా, ఆమె మాత్రం ససేమిరా అంటోంది. దీంతో మాజీ ప్రియురాలిపై కక్ష పెంచుకుని ఆమె ప్రాణాలు తీసేందుకు యత్నించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా వెదురుకుప్పం మండలంలో జరిగింది. గంటావారిపల్లె గ్రామానికి చెందిన మహిళ(45) తిరుపతిలోని ఓటేరు ప్రాంతానికి చెందిన జానకిరామిరెడ్డి ఇంట్లో పనిమనిషిగా పనిచేసేది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. Also Read: కొన్నాళ్ల తర్వాత ఆమె సంబంధం వద్దనుకుని మానుకోవడంతో జానకిరామిరెడ్డి ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఇదే సమయంలో మండల పరిధి కురివికుప్పం కాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఆ మహిళ జానకిరామిరెడ్డి నుంచి కొంత నగదును అప్పుగా ఇప్పించింది. గురువారం ఉదయం జానకిరామిరెడ్డి తనకు రావాల్సిన నగదును తీసుకోడానికి గంటావారిపల్లెకు వచ్చి తన డబ్బును ఇప్పించాలని ఆమెను కోరి వెంట తీసుకెళ్లాడు. కన్నికాపురం వద్దకు చేరుకున్నాక జానకిరామిరెడ్డి తనతో కొనసాగించాలని ఆమెపై ఒత్తిడి తేవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. Also Read: దీంతో ఆగ్రహానికి గురైన జానకిరామిరెడ్డి పక్కనే ఉన్న రాయితో మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో జానకిరామిరెడ్డి ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారాన్ని అందించి తానూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే జానకిరామిరెడ్డి కత్తెరతో తనను తాను గాయపరుచుకున్నాడు. ఎస్సై సుమన్‌ తన సిబ్బందితో కలిసి అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ పచ్చికాపల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By May 29, 2020 at 09:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-try-to-murder-on-woman-over-refused-to-continuing-illegal-affair-in-chittoor-district/articleshow/76083256.cms

No comments