Breaking News

కరోనాతో దూరదర్శన్ ఉద్యోగి మృతి.. తాత్కాలికంగా స్టూడియో మూసివేత


ప్రభావంతో హాస్పిటళ్లు, పోలీస్ స్టేషన్లు, న్యూస్ రూమ్‌లు తాత్కాలికంగా మూత పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకరికి కోవిడ్ సోకితే.. వారి నుంచి మిగతా వాళ్లకు సోకే ప్రమాదం ఉండటంతో.. అందర్నీ క్వారంటైన్లో ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో న్యూస్ స్టూడియో కూడా చేరింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో డీడీ న్యూస్‌లో వీడియో జర్నలిస్ట్‌గా పని చేస్తోన్న యోగేష్ కుమార్ ఇటీవల ఉన్నట్టుండి ఇంట్లో కుప్పకూలిపోయారు. మే 21న యోగేష్ కుమార్ చివరిసారిగా ఆఫీసుకు వెళ్లారు. ఒంట్లో నలతగా ఉండటంతో సెలవు తీసుకున్నారు. ఆయనలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని, శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది మాత్రం పడ్డారని యోగేష్ అన్నయ్య చెప్పారు. మే 27న ఆయన కుప్పకూలగా వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు తేల్చారు. ముందు వడదెబ్బ వల్ల చనిపోయాడని భావించగా.. తర్వాత గుండెపోటు వల్ల చనిపోయాడని తేలింది. తర్వాత కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో డీడీ న్యూస్ కెమెరా డివిజన్‌కు చెందిన 50 మందిని రాంమనోహర్ లోహియా హాస్పిటల్‌కు తరలించి కరోనా టెస్టులు చేశారు. డీడీ న్యూస్ స్టూడియోను తాత్కాలికంగా మూసివేసి శానిటైజ్ చేయించాలని నిర్ణయించారు. నవ్వుతూ పలకరిస్తూ.. వీడియోలు తీసే జర్నలిస్టు ఆకస్మికంగా చనిపోవడంతో డీడీ ఉద్యోగులు షాక్‌కు లోనయ్యారు. డీడీ న్యూస్ స్టూడియోను మండీ హౌస్ నుంచి ఖేల్‌గావ్‌కు మార్చేశారు. విభాగంలో ఒక్కో ఉద్యోగి వారానికి రెండు రోజుల చొప్పున విధులకు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.


By May 30, 2020 at 10:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/video-journalist-tests-positive-for-covid-19-posthumously-dd-news-shifts-operations-to-khelgaon/articleshow/76102732.cms

No comments