నడిరోడ్డుపైనే వివాహితపై అఘాయిత్యం.. ఆదిలాబాద్లో దారుణం
పట్టణంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వివాహితపై నలుగురు యువకులు నడిరోడ్డుపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇదేంటని ప్రశ్నించిన ఆమె భర్త, బంధువులపై నిర్ధాక్షిణ్యంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పట్టణంలో మూడు రోజుల క్రితం జరిగింది. పట్టణానికి చెందిన ఓ వివాహిత తన భర్తతో కలిసి ఇటీవల రిమ్స్కు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తోంది. మార్గమధ్యలో చికెన్ కొనుగోలు చేసేందుకు భర్త దుకాణానికి వెళ్లగా.. ఆమె రోడ్డుపక్కన నిల్చుని ఉంది. అదే సమయంలో నలుగురు ఆకతాయిలు ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా మాట్లాడారు. ఆమె శరీర భాగాలను వర్ణిస్తూ తాకేందుకు ప్రయత్నించారు. Also Read: ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో అతడు గొడవకు దిగాడు. దీంతో ఆ నలుగురు అక్కడికి పరారయ్యారు. ఈ ఘటన గురించి బాధితులు తమ బంధువులకు చెప్పగా వారంతా యువకులు ఉండే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ బాధితుల బంధువులపై యువకుల వర్గం దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు గాయపడ్డారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై లైంగిక వేధింపులు, దాడి కేసులు నమోదు చేశారు. నిందితులు అబ్దుల్, అవేజ్, అన్వర్లతో పాటు ఓ మైనర్ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. Also Read:
By May 27, 2020 at 07:43AM
No comments