Breaking News

భర్తపై అలిగి వెళ్లిపోయిన మహిళ.. రెండ్రోజులకే ఊరి చివర శవమై..


భర్తతో మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన ఓ మహిళ అనుమనాస్పద స్థితిలో శవమై కనిపించిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. చీమకుర్తికి చెందిన నాగమణి(30)కి అదే మండలం నాయుడుపాలేనికి చెందిన బొచ్చు ప్రసాద్‌తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అదే క్రమంలో ఈ నెల 17న వారి మధ్య వివాదం చెలరేగింది. దీంతో మనస్తాపం చెందిన నాగమణి 18వ తేదీ ఉదయం ఎవరూ లేని సమయంలో నాగమణి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. Also Read: ఆమె ఆచూకీ లభించకపోవడంతో 19న భర్త చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసుల మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో చండ్రపాలెం సమీపంలోని ఓబీసీ కాలువలో బుధవారం నాగమణి మృతదేహం బయట పడింది. ఆమె తండ్రి చెన్నుబోయిన వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నాగమణి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. Also Read:


By May 21, 2020 at 07:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-suspected-death-in-karnataka-police-under-investigation/articleshow/75858417.cms

No comments