Breaking News

కశ్మీర్: లొంగిపొమ్మని తల్లిదండ్రులు విజ్ఞ‌ప్తి చేసినా వినని ఉగ్రవాదులు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హతం


జమ్మూ కశ్మీర్‌లో మరోసారి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లా వాన్‌పొరా వద్ద జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులను సైన్యం హతమార్చింది. మరో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడ నుంచి తప్పించుకున్నారు. వాన్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం.. శనివారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టింది. ఆర్మీ, సీఆర్పీఎఫ్ దళాలు, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. భద్రతా బలగాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. సైన్యం కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. మరో ఇద్దరు తప్పించుకున్నారు. వారి కోసం సైన్యం ముమ్మరంగా గాలిస్తోంది. ఘటనా స్థలిలో భారీగా పేలుడు పదార్ధాలు, ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల తల్లిదండ్రులను అక్కడకు తీసుకొచ్చిన సైన్యం.. వారిని లొంగిపోవాలని అవకాశం ఇచ్చింది. సైన్యం వినతిని తిరస్కరించిన ఉగ్రవాదులు.. కాల్పులకు పాల్పడ్డారు. తక్షణమే అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. వీరిని లష్కరే తొయిబా ఉగ్రవాదులుగా భావిస్తుండగా.. కానీ, అధికారులు మాత్రం హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాదులని చెబుతున్నారు. ఐదు రోజుల కిందట కుల్గామ్‌లోని దంహల్ హంజీపొరాలో ఓ ఉగ్రవాదిని సైన్యం హతమార్చింది. లాక్‌డౌన్ సమయంలో అనేక మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. వీరిలో హిజ్బుల్ ముజాయిద్దీన్ కీలక నేత, మోస్ట్ వాంటెండ్ రియాజ్ నైకూ కూడా ఉన్నాడు. అతడి తలపై రూ.12 లక్షల రివార్డు కూడా ఉంది. మే మొదటి వారంలో రియాజ్‌ను ఎన్‌కౌంటర్‌లో సైన్యం హతమార్చింది.


By May 30, 2020 at 10:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-terrorists-killed-in-encounter-at-kashmirs-kulgam-refused-to-surrender-despite-parents-appeal/articleshow/76103083.cms

No comments