Breaking News

నవవధువు ప్రాణం తీసిన లాక్‌డౌన్.. భర్త ఎడబాటు తాళలేక ఆత్మహత్య


పెళ్లయిన మూడు రోజులకే మొదలు కావడంతో భర్తకు దూరంగా ఉంటున్న ఓ యువతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన పాతబస్తీలో జరిగింది. ఉప్పుగూడ దానయ్యనగర్‌కు చెందిన మోహన్‌ కుమార్తె వనజ(19)కు వరంగల్‌కు చెందిన అనిల్‌ అనే యువకుడితో మార్చి 19న ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి జరిగిన మూడో రోజునే లాక్‌డౌన్‌ విధించడంతో వనజ అత్తవారింటికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. తనను కాపురానికి తీసుకెళ్లాలని భర్తను తరుచూ కోరేది. అయితే రవాణా సౌకర్యం లేకపోవడంతో లాక్‌డౌన్ ముగిశాక సంప్రదాయబద్ధంగా తీసుకెళ్తామని అత్తమామలు చెప్పారు. Also Read: ఈ మధ్యలో అనిల్ రెండుమూడు సార్ల బైక్‌పై అత్తారింటికి వచ్చి భార్యను చూసి వెళ్లాడు. అయినప్పటికీ భర్తకు దూరంగా ఉండాల్సి వస్తోందని వనజ తీవ్ర మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఛత్రినాక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. పెళ్లయిన రెండు నెలలకే వనజ ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. Also Read:


By May 21, 2020 at 09:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-woman-commits-suicide-in-hyderabad-old-city/articleshow/75859736.cms

No comments