Breaking News

బీజేపీలోకి కీర్తి సురేష్.! అసలు విషయం చెప్పిన ‘మహానటి’ తల్లి


కీర్తి సురేష్... నేను శైలజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సావిత్రి మహానటి బయోపిక్‌తో ఇండియన్ సినిమా స్క్రీన్ పై తిరుగులేని నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. మహానటిలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఒక్కసారిగా సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత వారిపై అనేక రకాలు వార్తలు రావడం సర్వసాధారణమే. అయితే కీర్తి సురేష్‌పై కూడా అనేక రకాల పుకార్లు వినిపించాయి. ఆమెకు ఓ కమెడియన్‌తో పెళ్లైందని వార్తలు వస్తే.. మరోసారి ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి వస్తుందని కూడా పుకార్లు వినిపించాయి. మోదీంతో కలిసి దిగిన ఫోటో కూడా వైరల్ అయ్యింది. దీంతో బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో ఆమె తల్లి సీనియర్ హీరోయిన్ మేనక స్పందించారు. తాము బీజేపీ పార్టీకి సానుభూతిపరులమే అని ఆమె చెప్పారు. తన భర్తకు బీజేపీలో సభ్యత్వం ఉందని చెప్పిన మేనక తమ కుటుంబం అంతా బీజేపీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గానే ఉంటామని చెప్పింది. అయితే తన కుమార్తె కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీపై సైతం మేనక స్పందించింది. ప్రస్తుతం సినిమాల్లో చాలా ఛాన్సులు వస్తున్నందున ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని కూడా చెప్పింది. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీని తాము ఇటీవల కలిసిన మాట నిజమేనని ఆమె తెలిపారు. తన భర్త బీజేపీలోనే ఉన్నారని తెలిపారు. అయితే కీర్తి మాత్రం రాజకీయాల్లోకి రారన్నారు మేనక. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు.. కీర్తిసురేష్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న పుకార్లు చెక్ పెట్టారు ఆమె తల్లి మేనక. 2019 మే 13న ఆమె ఈ వార్తలపై స్పందించారు. ప్రస్తుతం కీర్తి తమిళ, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. చివరిగా ఆమె తమిళ సినిమా ‘సర్కార్’లో నటించింది. ఇందులో విజయ్‌గా జోడిగా కనిపించింది. ఇక ఇప్పుడు తమిళ, తెలుగుతో పాటు మళయాళం సినిమాల్లో కూడా నటిస్తోంది కీర్తి. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘అన్నత్తే’ సినిమాలో కనిపించనుంది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ రోల్ ఏంటి అనేది ఇంతవరకు బయటకు రాలేదు.


By May 13, 2020 at 10:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/this-day-last-year-keerthy-sureshs-mother-clarified-about-the-actresss-political-entry/articleshow/75709443.cms

No comments