Breaking News

ప్రేమను తిరస్కరించిందని యువతిపై కక్ష.. రూ.3లక్షల సుపారీతో మర్డర్ ప్లాన్


తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను కాదన్న ఆమె ఈ లోకంలో ఉండకూడదన్న ఆక్రోశంతో చంపేందుకు ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఏకంగా రూ.3లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆఖరి క్షణాల్లో ఈ విషయం బయటకు పొక్కడంతో సుపారీ గ్యాంగ్‌తో పాటు యువకుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. ఈ ఘటన జిల్లాలో వెలుగుచూసింది. Also Read: జిల్లాలోని ఎం.నాగులాపల్లికి చెందిన సత్యదేవ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవలే తన ప్రేమ సంగతి ఆమెకు చెప్పగా తిరస్కరించింది. అప్పటి నుంచి యువతిపై కక్ష పెంచుకున్న సత్యదేవ్ తనకు దక్కని ఆమెను ఎవరికీ దక్కకుండా చేయాలనుకున్నాడు. ఆమె చంపేందుకు తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్లాన్ వేశాడు. Also Read: ఇందుకోసం ఏలూరుకు చెందిన కొత్తపల్లి సురేశ్‌ గ్యాంగ్‌తో రూ.3లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.40వేలు ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ద్వారకా తిరుమల పోలీసులు సురేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసలు సత్యదేవ్‌తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By May 21, 2020 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/west-godavari-police-arrests-3-accused-of-woman-murder-plan/articleshow/75860587.cms

No comments