Breaking News

బెయిల్‌పై వచ్చి ఫ్రెండ్ తల్లిని చంపేశాడు.. మహారాష్ట్రలో దారుణం


కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్‌డౌన్ చేసినా నేరాలు మాత్రం ఆగడం లేదు. జైళ్లల్లో కరోనా వ్యాపించకుండా అనేక రాష్ట్రాలు ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడిచిపెడుతున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ నిర్ణయం ఓ మహిళ హత్యకు దారితీసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. Also Read: నాగ్‌పూర్‌కు చెందిన అశోక్ మూలే పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ భార్య సుశీల(52), కుమారుడు నవీన్‌తో కలిసి నందన్‌వన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. నవీన్‌కు గొటాఫోడ్(27) అనే స్నేహితుడు ఉన్నారు. ఓ నేరానికి సంబంధించి జైలు జీవితం గడుపుతున్న అతడు కరోనా ప్రభావంతో జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో తన క్లాస్‌మేట్ అయిన నవీన్‌ను కలిసేందుకు శనివారం అతడి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సుశీల, నవీన్ ఇద్దరూ ఇంట్లో ఉన్నారు,. తాను నవీన్‌ను చూడాలని గొటాఫోడ్ చెప్పగా సుశీల మండిపడింది. కరోనా వైరస్ సోకుతున్న సమయంలో తమ ఇంటికి ఎందుకొచ్చావని నిలదీసింది. తన కొడుకును చూసేందుకు వీల్లేదని, తిరిగి వెళ్లిపోవాలని గొడవపడింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి పరారయ్యాడు. Also Read: నిందితుడిని పట్టుకునేందుకు నవీన్ ప్రయత్నించగా అతడిపైనా కత్తితో దాడి చేశారు. రక్తపు మడుగులో పడివున్న తల్లిని నవీన్ స్థానికుల సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దీంతో పోలీసులు అతడిపై హత్యకేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు. నవీన్ ఓ బైక్ దొంగతనం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతడిపై ఓ మర్డర్ కేసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By April 05, 2020 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-friends-mother-in-nagpur-maharastra/articleshow/74989585.cms

No comments