Breaking News

మేడ్చల్‌లో ఇద్దరు యువతుల ఆత్మహత్య.. చిన్నారితో సహా


తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లో జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. డెంటల్ కాలేజీ డంపింగ్ యార్డులో ఇద్దరు యువతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు యువతులు పక్కనే వేర్వేరు చెట్లకు ఉరేసుకోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలో చిన్నారి మృతదేహం కూడా ఉండటంతో ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Also Read: సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో కూల్‌డ్రింక్ బాటిల్ కనిపించడంతో అందులో ఏదైనా విష పదార్థం కలుపుకుని తాగి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా పాపకు విషం తాగించి.. ఆమె చనిపోయిన తర్వాత వారిద్దరూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు మహిళల్లో ఒకరు పాపకు తల్లిగా గుర్తించారు. వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలు లేదా ఆర్థిక సమస్యలు కారణమై ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. Also Read: అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతుల వివరాలను తెలుసుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి అనేక కుటుంబాలు వలస వచ్చి జీవిస్తుంటారు. దీంతో మృతులు స్థానికులా? లేదా ఇతర ప్రాంతాలకు చెందిన వారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో నమోదైన మహిళ మిస్సింగ్ కేసులను పరిశీలించి వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. Also Read:


By April 13, 2020 at 10:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-women-commits-suicide-in-jawahar-nagar-in-medchal-district/articleshow/75116053.cms

No comments