Breaking News

ఓవైపు కిమ్ ఆరోగ్యం గురించి ప్రచారం.. మరోవైపు రాజధానిలో ఆహార కొరత


అధినేత ఆరోగ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా పలు కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో నిత్యావసరాల కొరత తీవ్రంగా ఉన్నట్టు ఓ మీడియా వెల్లడించింది. పలు దుకాణాల్లో ఆహార పదార్థాలు నిల్వలు నిండుకున్నట్టు సదరు న్యూస్ తెలిపింది. బహుశా కరోనా వైరస్ కట్టడికి తీసుకున్న చర్యల్లో భాగంగా నిత్యావసరాల కొనుగోళ్లపై కఠినమైన ఆంక్షలు విధించి ఉంటారని, అధినేత కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యానికి గురవుతారనేది తెలిసుండకపోవచ్చిన ఎన్‌కే న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది. పండ్లు, కూరగాయల దిగుమతిపై తొలుత ఆంక్షలు విధించగా.. తర్వాత ఇతర వస్తువులకు వీటిని అన్వయించారని ప్యాంగ్‌యాంగ్‌లోని కొందరు చెప్పినట్టు సదరు వైబ్‌సైట్ వివరించింది. భయాందోళనల కారణంగా ఉత్తర కొరియాలో ఆహార పదార్థాల ధరలు బాగా పెరుగుతున్నాయని రేడియో ఆసియా గతవారం ఓ కథనం ప్రచురించింది. పొరుగు దేశం చైనాలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండంతో జనవరిలోనే సరిహద్దులను మూసేసింది. తమ దేశంలో ఒక్క కరోనా వైరస్ కేసు నమోదుకాలేదని ఉత్తర కొరియా ప్రకటించగా.. ఈ విషయంలో తమకు అనేక అనుమానాలున్నాయని కొరియాలో అమెరికా సైనికదళాల చీఫ్ జనరల్ రాబర్ట్ ఆబ్రమ్స్ గత మార్చిలో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఉత్తర కొరియా తరుచూ ఆహార పదార్థాల కొరత సర్వసాధారణం. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఇది కూడా ఒకటి. 90వ దశకంలో ఉత్తర కొరియాలో 10 శాతం మంది జనాభా ప్రాణాలు కోల్పోయినట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆకలికి దారితీయవచ్చని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ఈ వారం హెచ్చరించింది. ఐరాస నివేదిక ప్రకారం.. అక్కడ 40 శాతం మంది జనాభా పోషకాహార లోపంతో బాధపడుతుంది. ఆహార అభద్రత, పోషకాహారలోపం విస్తృతంగా ఉన్నాయని పేర్కొంది. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమించిందని, కోమాలో ఉన్నారంటూ అనేక కథనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఉత్తర కొరియా మాత్రం మౌనం వహిస్తోంది. కిమ్‌ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై అక్కడి మీడియా కూడా మౌనం ప్రదర్శిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చ నడుస్తున్నా అక్కడి పత్రికల్లో మాత్రం కిమ్‌కు సంబంధించిన వార్తలు రాకవడం గమనార్హం. ఉత్తర కొరియా అధికారిక వార్తా ఏజెన్సీ కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ, అధికారిక పత్రిక రోడోంగ్‌ సిన్మన్‌ కూడా అధినేత ఆచూకి, ఆరోగ్య విషయంపై ఎలాంటి వార్తలు ప్రచురించలేదు.


By April 23, 2020 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/north-korean-capital-pyongyang-sees-panic-buying-of-food-report/articleshow/75313057.cms

No comments