Breaking News

భర్త ఆత్మహత్య.. బావతో సహజీవనం.. చివరకు ఆమె కూడా


కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా చౌడేపల్లె మండలంలోని బండ్లపాయి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన జ్యోతి (38)కి వాసు అనే వ్యక్తితో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి 15, 12 ఏళ్ల వయసుగల పిల్లలున్నారు. అయితే కుటుంబ కలహాలతో వాసు 2004లో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒంటరి అయిన జ్యోతి గ్రామంలోనే ఓ వ్యక్తి పొలం దగ్గర గుడిసె వేసుకుని జీవిస్తోంది. Also Read: ఈ క్రమంలో బావ చంద్రశేఖర్‌(వాసు అన్న)తో ఆమెకు సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. చంద్రశేఖర్‌ తరుచూ ఆమె ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విషయం అతడి భార్య, కుటుంబసభ్యులకు తెలియడంతో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బంధువులంతా జ్యోతిని మందలిస్తుండటంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో శనివారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకుంది. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు తిరుపతికి రెఫర్‌ చేశారు. అయితే మార్గమధ్యంలో జ్యోతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపైచౌడేపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By April 06, 2020 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/38-yr-old-woman-commits-suicide-im-chittoor-district-over-illegal-affair/articleshow/75001338.cms

No comments