Breaking News

భారత్‌లో పదివేలు దాటిన కరోనా కేసులు


భారత్‌లో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. తాజాగా కరోనా కేసులు పది వేల మార్కును దాటాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10,363. వీరిలో 1,035 మంది కోలుకున్నారు. 339 మంది మరణించారు. 8,988 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతుంది. రోజురోజుకు భారీగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 1,211 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 2,334 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 160 మంది మరణించారు. డిల్లీలో 1,510 కరోనా పాజిటివ్‌ కేసులు, తమిళనాడులో 1,173 కేసులు నమోదు అయ్యాయి. కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించింది. మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ నడుస్తుందని ప్రధాని ప్రకటించారు. మే 3వరకు దేశ ప్రజలంతా లాక్ డౌన్‌లోనే ఉండాలని మోదీ సూచించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోను కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయానికి తెలంగాణలో 592 పాజిటివ్ కేసులు ఉన్నాయి. 17 మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 103మంది కోలుకోగా ప్రస్తుతం 472 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే తెలంగాణలో 61 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇటు హైదరాబాద్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గడిచిన 24 గంట్లలో నగరంలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. ఇటు ఏపీలో కూడా కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. మొత్తం 439 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క గుంటూరు జిల్లాలో 93 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.


By April 14, 2020 at 11:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/as-india-hits-10000-case-mark-there-are-some-bright-spots/articleshow/75135273.cms

No comments