కొనసాగుతున్న కరోనా కల్లోలం.. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి మరణం

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గురువారం (ఏప్రిల్ 9) ఒక్క రోజే దేశంలో 781 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇదే గరిష్టం. అదేవిధంగా 31 మరణాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకున్నాయి. మహారాష్ట్రలో మరణాల సంఖ్య 100కు చేరువైంది. కాగా.. అసోంలో తొలి కరోనా మరణం నమోదైంది. హైలాకంది జిల్లాలో 65 ఏళ్ల వ్యక్తి కోవిడ్-19కు చికిత్స పొందుతూ మరణించాడు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఈ విషయాన్ని ప్రకటించారు. అసోం ఘటనతో ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటి కరోనా మృతి నమోదవడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం అసోంలో ఇప్పటివరకు 28 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీ నిజాముద్దీన్లో మర్కజ్ భవన్లో తబ్లిగీ జమాత్కు హాజరైనవారే. అసోం నుంచి 617 మంది జమాత్కు హాజరైనట్లు ఆరోగ్య శాఖ అంచనా వేసింది. లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా కరోనా వ్యాప్తి నివారణ చర్యలు కొనసాగుతాయని సీఎం హిమంత బిశ్వశర్మ ఇంతకుముందే ప్రకటించారు. మరోవైపు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్లో ఇప్పటివరకు 6738 కరోరా కేసులు నమోదు కాగా, 233 మరణాలు సంభవించాయి. Also Read:
By April 10, 2020 at 09:04AM
No comments