Breaking News

మూడు పెళ్లిళ్లు.. ఆరుగురు సంతానం.. నాలుగో పెళ్లికి యత్నిస్తూ దారుణహత్య


ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకుని, ఆరుగురు పిల్లలకు తండ్రయిన ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా నాలుగో పెళ్లికి యత్నిస్తూ దారుణహత్యకు గురైన ఘటన తమిళనాడులోని వేలూర్‌లో వెలుగుచూసింది. వేలూర్‌ కొసపేట ఎస్‌.ఎస్‌.కె.మానియం వీధికి చెందిన ఉదయ్‌ అలియాస్‌ ఉదయకుమార్‌(38) వేలూర్‌ ఇన్‌ఫెంటరీ రోడ్డులో ఓ క్లబ్‌ నడుపుతున్నాడు. అతడు ముగ్గురు మహిళలను ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లాడి ఆరుగురు పిల్లలకు తండ్రయ్యాడు. ఆదివారం సాయంత్రం కుట్టైమేడు పరిధిలో అతడు బైక్‌పై వెళుతుండగా ఆటోలో వచ్చిన ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు అడుకంపాలరై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. Also Read: ఈ ఘటనపై వేలూర్‌ సౌత్ పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. అప్పు అలియాస్‌ ఇమానువేల్‌, ఆటప్ప అలియాస్‌ నవీన్‌ కుమార్‌, అందిరేష్‌, నిర్మల్‌, వెంకటేశేష్‌, ఆల్వాలు ఈ హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు సోమవారం ఉదయం నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు గురైన ఉదయకుమార్‌పై అనేక కేసులు పెడింగ్‌లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఓ యువతిని నాలుగో వివాహం చేసుకోవడానికి ఉదయ్ ప్రయత్నాలు చేస్తుండగా, ఆమె అన్న అడ్డుపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో యువతి అన్న ఐదుగురు ఫ్రెండ్స్‌తో కలిసి ఉదయ్‌ను కిరాతకంగా చంపేసినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By April 21, 2020 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-brutally-murdered-in-tamilnadu-6-arrested/articleshow/75265293.cms

No comments