Breaking News

జమ్ముకాశ్మీర్‌లో కాల్పులు... 9మంది ఉగ్రవాదులు హతం


జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని భద్రత బలగాలు మట్టుపెట్టాయి. కాశ్మీర్‌లో గడిచిన 24 గంటల్లో తొమ్మిదిమంది ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. దక్షిణ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ఇటీవల నలుగురు పౌరులు మృతిచెందారు. పౌరులపై దాడి తర్వాత భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలా కాల్పుల్లో బత్‌పురా వద్ద శనివారం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇవాళ ఉదయం కూడా కెరాన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలు చేసిన దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కెరాన్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముష్కరుల్ని సైనికులు గుర్తించారు. వెంటనే అలర్ట్ అయి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు అయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందగా ఇద్దరికీ గాయాలయ్యాయి. మరోవైపు భారత సైనికులు ఎల్‌ఓసీ వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్నారు. నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జోరుగా కూంబింగ్ చేస్తున్నారు.


By April 05, 2020 at 12:13PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/9-terrorists-killed-in-24-hours-in-jammu-and-kashmir/articleshow/74990963.cms

No comments