కరోనా వైరస్ లైవ్ అప్డేట్స్: వణుకుతున్న బెజవాడ.. ఆ ఇద్దరి వల్ల 60 మందికి కరోనా


⍟ కట్టిడికి విధించిన రెండో దశ లాక్డౌన్ మరో వారం రోజుల్లో ముగియనుంది. ఏప్రిల్ 14న తొలి దశ లాక్డౌన్ తర్వాత కొన్ని కార్యకలాపాలు ప్రారంభానికి మినహాయింపులను ఇచ్చిన కేంద్రం.. రెండో దశ ముగియనుండగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకుంది. లాక్డౌన్ ముగిసిన తరువాత ఎలా వ్యవహరించాలి? అనేది పెద్ద సవాల్. అయితే, మే 3 తర్వాత ఏం చేయాలనేదానిపై కేంద్రం ఇప్పటికే స్థూలంగా ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. ⍟ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అమెరికాలో తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతోంది. గత 24 గంటల్లో అక్కడ మరో 2,494 మంది ప్రాణాలుకోల్పోయారు. దీంతో అమెరికాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 55వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది కొవిడ్ బారిన పడగా.. 2,06,997 మందిని మహమ్మారి బలితీసుకుంది. ప్రపంచంలో నమోదైన కేసులు, మరణాలను లెక్కిస్తే 6.96 శాతం మంది కోవిడ్తో చనిపోయారు. . ⍟ దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అంత కంతకూ పెరుగుతుండగా గడచిన గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 2వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దేశంలో వైరస్ మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ⍟ విజయవాడను కరోనా వణికిస్తోంది. గత రెండు, మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతోంది. కృష్ణాజిల్లాలో మొత్తం 177 కేసులు నమోదైతే. 140 యాక్టివ్ కేసులు ఉండగా.. జిల్లాలో 8మంది చనిపోయారు. అందులో విజయవాడలోనే 150 కేసులు ఉన్నాయి. ఆదివారం నమోదైన 52 కేసుల్లో విజయవాడలో 47 నమోదయ్యాయి. ⍟ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్-19) విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 29 లక్షల 72 వేలకిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే రెండు లక్షల ఐదువేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు ఈ వైరస్కు ఇప్పటికీ మందు కనుక్కోలేని క్రమంలో మలేరియాకు వాడే క్లోరోక్విన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులను వైరస్ చికిత్సలో భాగంగా వాడుతున్నారు. ⍟ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. సామన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఈ వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు ఇంటికే పరిమితమయ్యారు. అయితే కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కార్యాలయ సిబ్బంది ఒకరికి కరోనా వైరస్ (కోవిడ్-19) సోకింది. ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా విధులు నిర్వరిస్తున్న అధికారికి కరోనా వైరస్ సోకింది. ⍟ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఇది రక్షణ రంగ సిబ్బందికి కూడా సోకినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 15 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందికి కరోనా వైరస్ (కోవిడ్-19) సోకిందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని 31వ బెటాలియన్కు చెందిన సిబ్బంది అని తెలుస్తోంది. ⍟ లాక్ డౌన్లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగే వారికి అదుపు చేయడం ఎవరి తరమూ కావడం లేదు. పోలీసులు వాహనాలను సీజ్ చేస్తున్నా, కేసులు పెడుతున్నా, దండిస్తు్న్నా చాలా మంది వినడం లేదు. రోడ్లపైకి వచ్చేవారు పోలీసుల మాటలను పెడచెవిన పెట్టి తిరుగుతున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఓ హోంగార్డు బయట వాహనాలపై తిరుగుతున్న వారికి ఏం చెప్పాలో తెలియక నమస్కారం పెట్టారు. ⍟ ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఈ మహమ్మారి దెబ్బకు కర్నూలు, , కృష్ణా జిల్లాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఇరుగు-పొరుగున ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇదిలా ఉంటే.. గుంటూరులో ప్రముఖ బిర్యానీ హోటల్ నిర్వాహకుడు అనారోగ్యంతో చనిపోయాడు. ⍟ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1000 మార్క్ దాటింది. ఆదివారం (ఏప్రిల్ 26) 11 కొత్త కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 1001కి చేరింది. ఈ 11 కేసులూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కేసుల సంఖ్య స్వల్పంగా నమోదవుతుండటం గమనార్హం. ⍟ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు మన పురాణాల్లో మందు ప్రస్తావన ఉందని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు తెలిపారు. ‘యోగ వాశిష్ట్యం’ అనే గ్రంథంలో చంద్రుడికి సంబంధించిన అంశాల్లో కరోనాకు విరుగుడు గురించి ప్రస్తావించారని ఆయన వెల్లడించారు. దీనిపై శాస్త్రవేత్తలు దృష్టి సారించి, పరిశోధనలు చేస్తే సత్ఫలితాలు రావొచ్చని అభిప్రాయపడ్డారు.
By April 27, 2020 at 09:19AM
No comments