Breaking News

Madhya Pradesh Crisis సింధియా, 14 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా


మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. సోమవారం తన వర్గం ఎమ్మెల్యేలతో బెంగళూరుకు మకాం మార్చిన నేత జ్యోతిరాదిత్య సింధియా.. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం, ఆ వెంటనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోనియా గాంధీకి ఆయన తన రాజీనామా లేఖను పంపారు. వాస్తవానికి మార్చి 9నే సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు లేఖ ద్వారా స్పష్టమవుతోంది. ‘గత పద్దెనిమిదేళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగుతున్నానని.. ప్రస్తుతం పార్టీ నుంచి బయటకు వెళ్లే సమయం వచ్చింది.. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. గడిచిన ఏడాదిగా జరుగుతోన్న పరిణామాలు పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి దారితీశాయి.. ప్రారంభం నుంచి రాష్ట్ర, దేశ ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయడమే నా లక్ష్యం.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంటే అది కుదరదని బలంగా నమ్ముతున్నాను’ అని సింధియా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సింధియాతో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలు 14 మంది కూడా పార్టీకి రాజీనామా చేశారు.


By March 10, 2020 at 12:31PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-jyotiraditya-scindia-quits-party-resignation-letter-send-to-sonia-gandhi/articleshow/74561673.cms

No comments