అందుకే అన్నయ్యకి దూరంగా ఉంటున్నా.. మారుతీరావు సోదరుడి షాకింగ్ కామెంట్స్

కులాంతర వివాహం నేపథ్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండేళ్ల కిందట జరిగిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు ఈ రోజు ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో విషం తాగి సూసైడ్ చేసుకున్నాడు. కూతురు కులాంతర వివాహం చేసుకుందని భర్తను దారుణంగా హత్య చేయించిన మారుతీరావు.. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం సంచలనంగా మారింది. ఆయన ఆత్మహత్యకు సోదరుడితో ఆస్తి వివాదాలే కారణమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తమ్ముడు తిరునగరి శ్రవణ్ స్పందించారు. తనకు అన్నయ్యతో ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మా కుటుంబంలో అన్నయ్యతో ఆస్తి వివాదాలు కూడా లేవన్నారు. ప్రణయ్ హత్య కేసులో తనకు సంబంధం లేకపోయినా జైలు శిక్ష అనుభవించానని వాపోయారు. దీంతో మనస్థాపానికి గురై గత ఏప్రిల్ నుంచి అన్నయ్యతో మాట్లాడటం మానేసినట్లు చెప్పారు. Also Read: అప్పటి నుంచి మా మధ్య ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత సంబంధాలు కూడా లేవని శ్రవణ్ తెలిపారు. కేసు ట్రయల్ దశ కు వచ్చిందని.. అందువల్లే ఒత్తిడికి గురై ఆత్మహత్య కు పాల్పడి ఉంటాడని అనుకుంటున్నట్లు చెప్పారు. అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియగానే షాక్కు గురయ్యానని.. వెంటనే వదినను తీసుకొని నేరుగా ఉస్మానియా ఆస్పత్రికి వచ్చానని శ్రవణ్ తెలిపారు. అయితే మారుతీరావు ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్పై బయటకు వచ్చిన తరువాత సోదరుల మధ్య ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. కోట్ల రూపాయల ఆస్తిని తన కుమారుల పేరుమీద రాయాలని తమ్ముడు శ్రవణ్.. అన్న మారుతీరావును ఒత్తిడి చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. Read Also:
By March 08, 2020 at 01:21PM
No comments