Breaking News

చైనా క్యారంటైన్ భవనం విషాదం.. ఏడుగురు మృతి


మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. ఇప్పటికే కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతోన్న చైనాలో మరో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా బాధితుల కోసం క్వారంటైన్ సెంటర్‌గా ఏర్పాటుచేసిన ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ శిథిలాల కింద 71 మంది దాకా చిక్కుకోగా, ఇప్పటి వరకు 43 మందిని సురక్షితంగా బయటకు తీశారు. మిగతా 28 మంది గురించి శిథిలాల్లో గాలిస్తున్నారు. తూర్పు చైనాలోని ప్యుజియాన్‌ ప్రావిన్స్‌లోని క్వాంజౌ నగరంలో శనివారం (మార్చి 7) రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. Read Also: క్యారంటెయిన్ సెంటర్‌గా ఉపయోగిస్తున్న హోటల్ భవనం కూలిన ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందారని, 43 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారని చైనా అధికారిక మీడియా ట్విట్టర్‌లో వెల్లడించింది. క్వారంటెయిన్ సెంటర్‌గా వినియోగిస్తున్న ఈ భవనంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు పేర్కొంది. పునఃనిర్మాణ పనులు జరగడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం భవనం పోలీసుల స్వాధీనంలో ఉన్నట్టు తెలిపింది. Read Also: చైనాలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోయాయి. దీంతో హోటళ్లు, ఇతర భవనాలను బాధితులకు వైద్య సేవల కోసం వినియోగిస్తున్నారు. ప్రైవేట్ భవనాలను కూడా క్వారంటైన్ సెంటర్లుగా ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ సోకిన వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి, కోలుకున్న తర్వాత వారిని ఇంటికి పంపిస్తున్నారు. Read Also: తాజాగా ప్రమాదానికి గురైన ఐదంతస్తుల హోటల్‌ను క్వారంటైన్ సెంటర్‌గా మార్చారు. 2018 జూన్‌లో ప్రారంభమైన ఈ హోటల్‌లో 80 గదులు ఉన్నాయి. మొత్తం 800 మంది ఫైర్ ఫైటింగ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా, ఇప్పటి వరకూ చైనాలో కరోనా వైరస్ సోకి చనిపోయినవారి సంఖ్య 3,000 దాటింది. దాదాపు 90వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అటు ప్రపంచవ్యాప్తంగా 3,500 మంది మృత్యువాతపడగా, 102,300 మందికి వైరస్ సోకింది.


By March 08, 2020 at 01:15PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/seven-killed-as-hotel-used-as-quarantine-facility-collapses-in-china/articleshow/74535908.cms

No comments