Breaking News

జూబ్లిహిల్స్‌లో ప్రిన్సిపల్ పాడు పనులు.. మత్తు ఇచ్చి టీచర్లపై దారుణం!


విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. స్కూలు ప్రిన్సిపాల్‌గా పని చేస్తూ పాడు పనులు చేశాడు. తన తోటి టీచర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై సయీద్ అయుబ్ అనే ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో మహా జ్ఞాన స్కూల్ ప్రిన్సిపాల్‌గా సయీద్ అయుబ్ పని చేస్తున్నాడు. ఇతనికి గతంలోనే వివాహం జరిగింది. అయితే ఇదే స్కూలులో పని చేస్తున్న ఒక టీచర్‌కి మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. సయ్యద్ వలలో పడిన టీచర్‌కు మాయమాటలు చెప్పి సయీద్ అయుబ్ బయటికి తీసుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి అందించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత టీచర్‌ను బెదిరించి వివాహం చేసుకున్నాడు. తాను చెప్పినట్లు వినకపోతే అత్యాచారం చేసిన సమయంలో తీసిన వీడియోను బట్టబయలు చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన టీచర్.. సయీద్ అయుబ్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయం కాస్త టీచర్ తల్లి దండ్రులకు తెలిసింది. దీంతో స్కూల్‌కి వచ్చి సయీద్ అయుబ్ నిలదీశారు. Also Read: దీంతో తాను టీచర్‌ను రెండో భార్యగా చూసుకుంటానని చెప్పాడు. ఆగ్రహించిన టీచర్ తల్లిదండ్రులతో పాటు బంధువులు స్కూలుపై దాడి చేశారు. మరోవైపు టీచర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నమ్మించి మోసం చేసి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సయీద్ అయుబ్ మోసం చేసి టీచర్‌ను వశపర్చుకున్నాడని, అత్యాచారం చేశాడని తేలడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: Must Read:


By March 17, 2020 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/principal-sexual-assault-on-teacher-in-jubleehills-hyderabad/articleshow/74665809.cms

No comments