Breaking News

‘భారత్‌లో వేసవిలోనూ కరోనా మనుగడ... చలికాలంలో మళ్లీ విజృంభణ’


ప్రపంచాన్ని వణికిస్తోంది. కోవిడ్ దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిల్లాడిపోతున్నాయి. అమెరికా, యూరప్ దేశాలు కోవిడ్ కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, కాదని బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. యూరప్ దేశాలు లాక్ డైన్ ప్రకటించాయి. కాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. పరిస్థితి నిలకడగానే ఉంది. భారత్‌లో వేడి వాతావరణంలో వైరస్ వృద్ధి చెందదని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఈ వేసవి అంతటా కరోనా వైరస్ భారత్‌లో మనుగడ సాగిస్తుందని.. వచ్చే శీతాకాలంలో మళ్లీ బయటపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కరోనాపై పరిశోధనలు చేస్తున్న నిపుణులు తెలిపారు. గత రెండు దశాబ్దాల్లో సార్స్, మెర్స్ లాంటి వైరస్‌లు మానవాళిపై ప్రభావం చూపగా.. SARS-CoV-2 మహమ్మారి మూడో అత్యధిక ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తెలిపారు. ఇది వేడి, తేమ వాతావరణంలో వ్యాప్తి చెందగలదని స్పష్టం చేశారు. ఈ వైరస్‌ను తట్టుకునేందుకు మనుషుల్లో ఇప్పటి వరకూ సహజ రోగనిరోధక శక్తి లేదని పరిశోధకులు తెలిపారు. సన్నిహితంగా మెలగడం, తుప్పర్ల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందన్నారు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుప్పర్లలోని వైరస్ ఏప్రిల్, మే నెలల్లో బయటి వాతావరణంలో ఎక్కువ సేపు బతకదన్నారు. వేడి వాతావరణం వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఉపకరిస్తుందని ఆశించే బదులు.. ప్రజలు సమూహాలుగా తిరగొద్దని.. ఇన్ఫెక్షన్లను అరికట్టడం కోసం పబ్లిక్ ప్లేసులపై ఆంక్షలు విధించాలని సూచించారు.


By March 17, 2020 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-will-live-through-summer-in-india-reappear-in-winter-who/articleshow/74665885.cms

No comments