Breaking News

భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన.. అమెరికా కాంగ్రెస్ సంచలన నివేదిక


భారత్‌లో చేసుకుంటున్న హింస, వివక్ష సహా మానవహక్కుల స్థితిగతులపై 2019 నివేదికను అమెరికా రూపొందించింది. భారత్‌లో మతం, సామాజిక ఆధారంగా మైనార్టీలపై హింస, వివక్ష ఆ దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన మానవహక్కుల ఉల్లంఘనలో ఒకటని నివేదిక పేర్కొంది. మత, సామాజిక స్థితిగతుల ఆధారంగా మైనారిటీలపై హింస, వివక్ష చోటు చేసుకుంటున్నాయని బుధవారం విడుదల చేసిన అధికారిక నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో విడుదల చేశారు. హింస, వివక్షను అతరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా, అధికారులకు జవాబుదారీతనం లేకపోవడం అన్నిస్థాయిల్లో కొనసాగుతూ విస్తృత శిక్షార్హతకు దోహదం చేస్తోందని తెలిపింది. భారత్‌లో హత్యలు, ఖైదీలపై అధికారుల చిత్రహింసలు, ఏకపక్ష అరెస్టులు, జైళ్లలో అధ్వాన్న పరిస్థితులు కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌, ఈశాన్య భారతంలో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, పౌరులపై తీవ్ర నేరాలు, మానవహక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. గతేడాది ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దుచేసిన తర్వాత పరిస్థితులపై గురించి నివేదికలో ప్రస్తావించింది. రద్దు తర్వాత భద్రతా కారణాలతో జమ్మూ కశ్మీర్‌లోని స్థానిక రాజకీయ నాయకుల సహా వేలాది మంది ప్రజలను నిర్బంధించారని, మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి, పౌరుల కదలికలపై ఆంక్షలు విధించినట్టు వివరించింది. నివేదిక విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన మైక్ పాంపియో.. చైనా, ఇరాన్, వెనిజులా, క్యూబా వంటి దేశాలలో మానవ హక్కుల ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అసమ్మతివాదులను పర్యవేక్షించడానికి హైటెక్ నిఘా వ్యవస్థలను ఉపయోగిస్తుంది. చారిత్రాత్మక వ్యతిరేకతలో భాగంగా మత శిబిరాల్లో మైనారిటీలను జైలుకు పంపుతోందని’ అని వ్యాఖ్యానించారు. క్యూబా, వెనుజులా, చైనా, ఇరాన్‌లోని ప్రజలందరూ తమ ప్రభుత్వాలతో ఎలాంటి భయం, ఆందోళన చెందకుండా స్వేచ్ఛగా మాట్లాడటం, సమావేశం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లోని రాజకీయ ఖైదీలు, హింస, బెదిరింపులు, జర్నలిస్టులపై అన్యాయంగా కేసులు, ప్రాసిక్యూషన్లతో సహా భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికలపై ఆంక్షలు, సామాజిక విచారణకు క్రిమినల్ పరువు చట్టాలను ఉపయోగించడం, మీడియా ప్రసంగం, సెన్సార్‌షిప్, సైట్లను నిరోధించడం లాంటివి కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది. ప్రభుత్వేతర సంస్థలపై అధిక నియంత్రణ, ప్రభుత్వ అన్ని స్థాయిలలో విస్తృతమైన అవినీతి, బలవంతపు శ్రమ దోపిడీ, బాల కార్మికుల నిర్బంధంపై కూడా నివేదికలో వివరించింది.


By March 12, 2020 at 09:14AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-state-secretary-mike-pompeo-released-us-congress-report-on-human-rights-in-india/articleshow/74587043.cms

No comments