మద్యం మత్తులో కన్నతల్లిపైనే కామం... అడ్డొచ్చిన తండ్రిని బండరాయితో కొట్టి

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిపైనే అత్యాచారానికి యత్నించాడో కామాంధుడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో మాతృమూర్తినే కోరిక తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అడ్డుకోబోయిన తండ్రిపైనే దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిని అడ్డుకున్న అమ్మను బండరాయితో మోది చంపేశాడు. ఈ దారుణ ఘటన జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో బుధవారం జరిగింది. Also Read: ఎమ్మిగనూరు లక్ష్మీపేటకు చెందిన ఆకుల ఉరుకుందమ్మ(48), రాజులకు కుమారులు వీరేశ్, ఉదయ్, కుమార్తె ఉష సంతానం. పెద్ద కుమారుడు వీరేశ్(28) మద్యానికి అలవాటు పడి జులాయిగా మారాడు. మద్యం మత్తులో మంగళవారం అర్ధరాత్రి దాటాక తల్లి ఉరుకుందమ్మపై వీరేశ్ అత్యాచారానికి యత్నించాడు. అడ్డుకోబోయిన తండ్రి, సోదరుడిని చంపేస్తానంటూ కత్తితో బెదిరించాడు. తండ్రి రాజుపై పిడి గుద్దులు గుద్దుతూ వీధి బయటకు లాగి బండరాయితో కొట్టాడు. Also Read: భర్తను కాపాడుకునేందుకు అడ్డొచ్చిన ఉరుకుందమ్మ తలపై బండరాయితో మోది ప్రాణం తీశాడు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు అక్కడికక్కడే చనిపోవడంతో వీరేశ్ పరారయ్యాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఎమ్మిగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By March 12, 2020 at 09:49AM
No comments