Breaking News

ఢిల్లీ అల్లర్లు: ఐబీ ఆఫీసర్ పోస్ట్‌మార్టమ్ నివేదికలో సంచలన విషయాలు


ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ హింసకు దారితీసి 50 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో ఇంటిలిజెన్స్ అధికారి అంకిత్ శర్మ ఓ మురుగు కాల్వలో శవమై కనిపించారు. అంకిత్ శర్మ మృతిపై పోస్ట్‌మార్టమ్ నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆయన ఊపిరితిత్తులు, మెదడుకు తీవ్ర గాయాలు కావడం వల్ల ఆయన షాక్‌కు గురై చనిపోయినట్టు నివేదికలో వెల్లడయ్యింది. పదునైన ఆయుధాలతో దాడిచేసినట్టు కొన్ని గాయాలు తెలియజేస్తున్నాయి. మొత్తం ఆయన శరీరంపై 51కిపైగా గాయాలు ఉన్నట్టు తేలింది. వీటిలో 12 కత్తిపోట్లు, కాళ్లు, వెనుక భాగం, తొడలపై పదునైన ఆయుధాలతో దాడిచేసి గాయపరిచారు. 33 గాయాలు రాడ్లు, మొద్దుబారిన ఆయుధాలతో చేసినట్టు తేలింది. అంకిత్ శర్మను దుండగులు దారుణంగా హతమార్చి డ్రైనేజీలో పడేసిన సంగతి తెలిసిందే. దుండగులు అతడి శరీరంపై అంగుళం కూడా ఖాళీ లేకుండా కత్తితో తూట్లు పొడిచారు. అంకిత్ శర్మ శరీరంపై 400కు పైగా కత్తి గాట్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో వెల్లడయినట్టు ఆయన హత్య జరిగిన రెండు రోజుల తర్వాత బయటకు వచ్చింది. గంటల తరబడి అంకిత్ శర్మను దుండగులు చిత్ర హింసలకు గురిచేశారని ఫోరెన్సిక్ డాక్టర్లు తెలిపారు. ‘4 నుంచి 6 గంటలపాటు అంకిత్ శర్మను పదునైన ఆయుధాలతో చిత్ర హింసలకు గురి చేసిన దుండగులు రాక్షసానందం పొందారు. ఆరుగురు వ్యక్తులు అతడిని తీవ్రంగా గాయపర్చి ఉంటారు’ అని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. అతణ్ని ఎంత దారుణంగా చంపారంటే.. కత్తి పోట్ల ధాటికి పొట్టలోని పేగులు చిధ్రమైపోయాయి. ఓ వ్యక్తిని ఇంత దారుణంగా కసితీరా తూట్లు తూట్లుగా పొడిచి చంపడాన్ని తమ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఫోరెన్సిక్ డాక్టర్లు తెలిపారు. పదునైన ఆయుధంతో అనేకసార్లు దాడి చేయడం వల్లే అంకిత్ శర్మ చనిపోయాడని పోస్టు మార్టం రిపోర్ట్ తేల్చింది.


By March 14, 2020 at 11:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/51-injuries-found-on-ib-staffer-ankit-sharmas-body-says-postmortem-report/articleshow/74623342.cms

No comments