Breaking News

జమ్ముకాశ్మీర్‌లో మరో కరోనా మృతి.. రెండుకు చేరిన సంఖ్య


కరోనా వైరస్ భారతదేశంలో రోజురోజుకు వ్యాపిస్తోంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. తాజాగా జమ్ముకాశ్మీర్‌లో కరోనా బాధితుడు మృతిచెందాడు. శ్రీనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో జమ్ముకాశ్మీర్‌లో రెండుు పెరిగిందని అక్కడి అధికారులు ప్రకటించారు. జమ్ము కాశ్మీర్‌లో 33మంది కరోనా బారిన పడ్డారు భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. కేసుల సంఖ్య వేయికి దగ్గర్లో ఉది. నిన్న ఒక్క రోజే దేశంలో 179 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 28 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే అత్యధిక మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఆరుగురు కరోనా బారిన పడి మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 26కు చేరింది.


By March 29, 2020 at 10:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-suffering-from-covid-19-dies-at-srinagar-hospital/articleshow/74870243.cms

No comments