కీచక మామ.. కోరిక తీర్చాలంటూ కోడలికి వేధింపులు.. కొడుకు చేతిలో హతం

తన భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రిని కిరాతకంగా చంపేశాడో వ్యక్తి. ఈ ఘటన జిల్లా యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పిర్ల తమ్మారావు(55), దండమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. తమ్మారావు తనకు ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కుమారులకు వివాహాలు అయ్యాయి. పెద్ద కుమారుడు ఆదినారాయణ ఆ ఇంటిలోనే ఓ పోర్షన్లో విడిగా ఉంటుండగా... చిన్న కుమారుడు బాబూరావు తల్లిదండ్రులతో ఉమ్మడిగా ఉంటున్నాడు. Also Read: ఈ నెల 13న పెద్ద కుమారుడు ఇంటిలో లేని సమయంలో తమ్మారావు పెద్ద కోడలితో అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు. తన కోరిక తీర్చాలని, కొడుక్కి తెలియకుండా తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని వేధించాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తమ్మారావు శనివారం రాత్రి నుంచి ఇంటికి రాకుండా పొలం వద్దే ఉంటున్నాడు. Also Read: తండ్రిపై కక్ష పెంచుకున్న ఆదినారాయణ ఆదివారం రాత్రి పొలం వద్ద నిద్రపోతున్న తమ్మారావు తలపై బలంగా కొట్టి హత్య చేసి పరారయ్యాడు. సోమవారం ఉదయం పొలానికి చేరుకున్న భార్య దండమ్మ మంచంపై విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి రోదించడంతో గ్రామస్థులందరూ అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ ఇన్ఛార్జి డీఎస్పీ భీమారావు, పిఠాపురం సీఐ సూర్య అప్పారావు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికులు, మృతుడి భార్యను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. పెద్ద కుమారుడే తన భర్తను హత్య చేశాడని దండమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. Also Read:
By March 17, 2020 at 11:19AM
No comments