రజినీ సంచలన నిర్ణయం: పార్టీ పెడుతున్నా.. అతన్నే సీఎం చేస్తా

తమిళనాడులోని రజనీ మక్కల్ మండ్రల్ ఆఫీస్ బేరర్లతో సూపర్ స్టార్ భేటీ అయ్యారు. 15 ఏళ్లుగా తన రాజకీయ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయన్నారు. 2017లో డిసెంబర్లో తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చానన్నారు. తమిళనాడులో పరిస్థితుల్ని విశ్లేషించడం మొదలు పెట్టానన్నారు. వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ నేతలకు ప్రజలటే కేవలం ఓట్లతోనే సమానం అన్నారు. ప్రజల మనస్తత్వం కూడా మారాలన్నారు. సమయానికి తగ్గట్టు పారిపలన సాగడం లేదన్నారు రజనీ. ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకే రాజకీయాల్లో అవకాశాలు వస్తున్నాయన్నారు. త్వరలోనే తాను ఓ రాజకీయ పార్టీని ప్రకటిస్తానన్నారు రజనీకాంత్. తన పార్టీలో మాత్రం యువతకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. తాను కేవలం పార్టీ అధినేతగా మాత్రమే ఉంటానన్నారు. సీఎం అభ్యర్థిగా మాత్రం వేరేవారిని నిల్చోబెడతానన్నారు. చదువు, విజ్ఞానవంతుడైన వ్యక్తినే సీఎంను చేస్తానన్నారు. తనపై వచ్చిన ఊహాగానాలకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో అస్థిరత ఏర్పడిందన్నారు రజనీకాంత్. రాజకీయాల్లోకి యువరక్తం రావాలన్నారు. పార్టీ, ప్రభుత్వంపై ఒకే వ్యక్తి పెత్తనం ఉండకూడదన్నారు సూపర్ స్టార్. ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ అధ్యక్షుడి ప్రమేయం ఉండకూడదన్నారు. రాష్ట్రానికి సీఎం కావాలని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు రజనీకాంత్. సీఎం పదవిపై తనకు వ్యామోహం కూడా లేదన్నారు. ప్రజల్లో మార్పు రానప్పుడు తాను వచ్చి కూడా ఏం చేయలేనన్నారు.
By March 12, 2020 at 11:20AM
No comments