Breaking News

హైదరాబాద్‌లో వివాహిత అనుమానాస్పద మృతి.. భర్త గల్ఫ్‌లో


హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చాంద్రాయణగుట్టకు చెందిన షోయెబ్‌కు జేబా ఫాతిమాకు ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. మూడేళ్ల కిందట షోయెబ్‌ గల్ఫ్‌కు వెళ్లగా భార్య జేబా ఫాతిమా(37) నగరంలోనే ఉంటోంది. తన తల్లి, సోదరుడితో పాటు ఈ నెల 10న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 1లోని ఓ హోటల్‌లో బస చేసింది. ఈ క్రమంలో మౌత్‌ ఫ్రెష్‌నర్‌ ద్రవాన్ని తాగి అస్వస్థతకు గురైన ఫాతిమాను కుటుంబసభ్యులు 18వ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె 24న మృతి చెందింది. Also Read: షోయెబ్‌ విదేశాల నుంచి వచ్చే అవకాశం లేకపోవడంతో బంధువైన సయ్యద్‌ రజాహుస్సేన్‌ రజ్వీకి శుక్రవారం ఫోన్‌చేసి అపోలో ఆస్పత్రికి వెళ్లాలని కోరాడు. ఆస్పత్రిలో మృతదేహాన్ని చూసిన రజ్వీ ఆమె మరణంపై అనుమానం వ్యక్తంచేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్ట నిమిత్తం పోలీసులు గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 28, 2020 at 10:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-suspected-death-in-hyderabad-police-booke-case/articleshow/74857846.cms

No comments