Breaking News

90 ఏళ్ల వృద్ధురాలిపై 22 ఏళ్ల యువకుడి అత్యాచారం.. గోళ్లతో రక్కి దారుణంగా


దిశ ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత కూడా తెలంగాణలో మహిళలపై నేరాల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. రాజధాని హైదరాబాద్ నుంచి మూరుమూల గ్రామం వరకు నిత్యం ఏదొక చోట బాలికలు, యువతులు, మహిళలపై కామాంధులు దాడికి పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా జిల్లా అనుముల మండలంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న 90 ఏళ్ల వృద్ధురాలిపై ఓ తాగుబోతు అత్యాచారం చేసి హత్య చేశాడు. Also read: అనుముల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు గ్రామ శివారులో గుడిసెలో ఒంటరిగా నివాసముంటుంది. ఆదివారం ఉదయం టీ ఇవ్వడానికి ఆమె కోడలు వెళ్లగా వృద్ధురాలు విగతజీవిగా పడి ఉంది. ఆ ప్రాంతంలో రక్తపు మరకలు, వృద్ధురాలి ఒంటిపై పంటిగాట్లు, గోళ్లతో రక్కిన ఆనవాళ్లను గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. Also read: అదే గ్రామానికి చెందిన సత్రశాల శంకర్‌ (22) అనే యువకుడు శనివారం సాయంత్రం నుంచి మద్యం తాగి తన తల్లి ఇంటి వద్ద తిరుగుతూ కనిపించాడని, అతడే తన తల్లిపై అత్యాచారానికి పాల్పడి చంపేశాడని పెద్ద కుమారుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సత్రశాల శంకర్‌ గతంలోనూ రెండుసార్లు మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, పెద్దలు పంచాయతీ పెట్టి అతన్ని మందలించారని గ్రామస్థులు చెబుతున్నారు. Also read:


By March 02, 2020 at 10:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/90-yr-old-woman-raped-and-murdered-in-nalgonda-district/articleshow/74434519.cms

No comments