మసాజ్ సెంటర్లో బాలికలతో వ్యభిచారం.. 9 మందితో ముగ్గురు విటులు

మసాజ్ సెంటర్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్ పోలీసులు రట్టుచేశారు. లాసుడియా పోలీస్స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్ ప్రాంతంలో కొద్దిరోజులుగా నేచుర్ స్పా పేరుతో మసాజ్ సెంటర్ కొనసాగుతోంది. ఇటీవల అక్కడికి యువకుల తాకిడి పెరగడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మసాజ్ సెంటర్పై నిఘా పెట్టారు. గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఆ సెంటర్పై పోలీసులు రైడ్ నిర్వహించారు. Also Read: ఈ సందర్భంగా 9 మంది బాలికలు, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రైడ్ చేసిన సమయంలో రెండు జంటలు గదిలో నగ్నంగా ఉన్నాయి. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దుస్తులు వేసుకున్న తర్వాత స్టేషన్కు తీసుకెళ్లారు. బాలికలు సిక్కిం, పశ్చిమబెంగాల్కు చెందినవారుగా గుర్తించారు. మసాజ్ సెంటర్ యజమాని ఆకాష్ జోగి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, తర్వలోనే పట్టుకుంటామన్నారు. Also Read:
By March 15, 2020 at 01:36PM
No comments