Breaking News

కోవిడ్: 8 వేలకు చేరిన మృతులు.. దాదాపు 2 లక్షల మందికి వైరస్


ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌.. ప్రస్తుతం 164 దేశాలకు వ్యాప్తిచెందింది. దాదాపు 2 లక్షల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, స్పెయిన్‌లో వైరస్ మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు చైనాలో 3,237 మంది ప్రాణాలు కోల్పోగా, 80,894 కేసులు నమోదయ్యాయి. మంగళవారం మరో 11 మంది వైరస్ వల్ల మృతి చెందారు. కొత్తగా మరో 11 మందికి వైరస్ సోకగా, వీరిలో 10 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. Read Also: వైరస్ నియంత్రణంలో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధించాయి. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా కర్ఫ్యూలు, సరిహద్దుల మూసివేత లాంటి చర్యలు చేపట్టాయి. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 15,000 కేసులు నమోదు కాగా, దాదాపు 850 మంది మృతిచెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌తో మంగళవారం మరో 26 మంది మృతిచెందగా, మృతుల సంఖ్య 112కి చేరింది. కేసుల సంఖ్య 6,500 వేలు దాటింది. Read Also: అటు ఐరోపాలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా ఇటలీలో మంగళవారం మరో 345 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 2,503 దాటి, చైనాకు చేరువవుతోంది. కొత్తగా మరో 3,526 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం కేసులు 31,500 దాటింది. ఇటలీలో రోమ్‌, మిలాన్‌ సహా పలు నగరాల్లో క్రీడా మైదానాలు మూసివేశారు. డెన్మార్మ్‌ సరిహద్దులు మూసివేసింది. ఇరాన్, స్పెయిన్‌లోనూ వైరస్ స్వైరవిహారం చేస్తోంది. మంగళవారం ఇరాక్‌లో 135 మంది, స్పెయిన్‌లో 191 మంది ప్రాణాలు కోల్పోయారు. పొరుగు దేశం పాకిస్థాన్‌లో బాధితుల సంఖ్య 190కి చేరింది. ఇరాన్ సరిహద్దుల్లోని ప్రావిన్సుల్లో అత్యధికంగా 157 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న వారు సొంత పరిజ్ఞానంతో మందులు వాడి, ప్రమాదాన్ని కోరి కొనితెచ్చుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. Read Also: వైరస్‌ బాధితులు నొప్పులను తగ్గించే ఐబూప్రోఫెన్‌‌కు బదులు పారాసిటమాల్‌ను వాడాలని సూచించింది. కొవిడ్‌ బాధితులు విచ్చలవిడిగా ఐబూప్రోఫెన్‌ ఔషధాలను వాడుతున్నట్లు ఫ్రెంచ్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. నొప్పులు, బాధ నివారణ ఔషధాల వాడకం కరోనా వైరస్‌ను నివారిస్తుందనడంలో వాస్తవం లేదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అధిక మోతాదులో వాడే ఈ మందుల వల్ల మూత్రపిండ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదముందని హెచ్చరించింది.


By March 18, 2020 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/globally-more-than-198000-are-infected-and-over-7984-have-died-due-to-coronavirus/articleshow/74683483.cms

No comments