Breaking News

మహారాష్ట్రలో మరో ఇద్దరికి కరోనా.. 47కి చేరిన కేసులు


దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదువుతున్నాయి. తాజాగా, మరో ఇద్దరికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. ముంబైకి చెందిన ఇద్దరు మహిళలకు కోవిడ్ నిర్ధారణ కావడంతో మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 47కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 170 కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన రోజుకూలీలకు ఆర్థిక సాయం అందజేయాలి ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా తీసుకున్న మూసివేత చర్యల వల్ల శ్రామికులు నష్టపోకుండా యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై విధివిధానాలను రూపకల్ప కోసం ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ఓ అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ముఖ్యమంత్రికి మూడు రోజుల్లో నివేదికను అందచేయనుంది. కరోనా వైరస్‌ కట్టడి ముందస్తు చర్యల్లో రైల్వే అప్రమత్తంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఎక్కువ మంది ఉండే రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ల గురువారం నుంచి మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, స్థానికంగా ఉన్న రైల్వే కమ్యూనిటీ హాల్‌ను సిద్ధం చేయాలన్నారు. సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని ఆదేశించారు. కరోనా వైరస్‌ ప్రభావం పోయేంత వరకు దీనిని ఖాళీగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో సతమతమౌతున్నవేళ 103 ఏళ్ల వయసున్న ఓ బామ్మ కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. వివరాల్లోకి వెళితే ఇరాన్‌లోని సెమ్‌నాన్‌ సెంట్రల్‌ సిటీకి చెందిన 103 ఏళ్ల వృద్ధురాలికి కరోనా వైరస్‌ సోకడంతో వారం క్రితం ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం ఆమె కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యిందని సెమ్‌మాన్‌ వైద్య విశ్వవిద్యాలయ అధిపతి నవీద్‌ దనాయీ తెలిపారు. కొన్నిరోజుల క్రితం ఇరాన్‌లోని కెర్మాన్‌కు చెందిన మరో 91 ఏళ్ల వృద్ధుడు కూడా కరోనా నుంచి కోలుకుని ఆశ్చర్యపరిచాడు.


By March 19, 2020 at 11:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-women-test-ve-in-mumbai-maharashtras-count-now-47/articleshow/74705378.cms

No comments