Breaking News

రూ.40వేల సుపారీ ఇచ్చి తమ్ముడి హత్య.. ఆస్తి కోసం అన్న ఘాతుకం


రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడిని సుపారీ గ్యాంగ్ ద్వారా దారుణంగా చంపించిన అన్నను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చింతూరు మండలం తుమ్మల గ్రామానికి చెందిన సోడె నాగిరెడ్డి ఈనెల11న కనిపించకుండా పోయాడు. నాగిరెడ్డికి అతడి అన్న ముత్తయ్య మధ్య భూమి, మేకలు పంపకాల్లో గొడవలు కొనసాగుతున్నాయి. భూమిలో న్యాయమైన వాటా ఇవ్వలేదన్న కోపంతో నాగిరెడ్డిపై ముత్తయ్య కక్ష పెంచుకున్నాడు. అతడి అడ్డు తొలగించుకుంటే మొత్తం భూమి తనకే వస్తుందని ఆశపడ్డాడు. Also Read: దీంతో నాగిరెడ్డిని హత్య చేసేందుకు తెలంగాణాలోని ములకపల్లి మండలం గుండాలపాడుకు చెందిన కుంజా కన్నారావు, మడకం దేవయ్యలతో రూ.40వేలకు బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.5వేలు చెల్లించాడు. మిగిలిన మొత్తాన్ని జూన్ నెలలో ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఈ నెల 11న కిరాయి హంతకులు, ముత్తయ్య తుమ్మల గ్రామానికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న నాగిరెడ్డి(50) తలపై గొడ్డలితో మోది చంపేశారు. Also Read: మృతదేహాన్ని ఇంటికి కిలోమీటరు దూరంలో ఉన్న చంద్రవంక వాగు వద్దకు మంచంతో పాటు ఎత్తుకెళ్లారు. మంచాన్ని ముక్కలు చేసి నాగిరెడ్డి మృతదేహంతో పాటు ఇసుకలో పాతి పెట్టారు. మరుసటి రోజు ఉదయం నాగిరెడ్డి కనిపించకపోవడంతో అతడి కొడుకు రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలియడంతో పోలీసులు ముత్తయ్యపై నిఘా పెట్టారు. అతడి ఫోన్‌కాల్స్ ఆధారంగా తమ్ముడిని అతడే చంపించాడని తెలుసుకుని అదుపులోకి తీసుకుని విచారించడా నేరాన్ని అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో హత్యలో భాగస్వాములైన అందరినీ చింతూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By March 17, 2020 at 09:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-arrested-in-east-godavari-district-over-kills-brother-for-property-issue/articleshow/74666626.cms

No comments