Breaking News

రూ.3వేల కొసం 5 హత్యలు.. తమిళనాడులో నరహంతకుడు అరెస్ట్


గంజాయి మత్తులో తూగుతూ వలం రూ.3వేల కోసం ఐదు ప్రాణాలు తీసిన నరరూప హంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. కంటోన్మెంట్‌ ఓత్తకడై ప్రాంతంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అనేక జ్యువెల్లరీ, సెల్‌ఫోన్‌ తదితర షాపులు ఉన్నాయి. అక్కడ వాచ్‌మెన్‌గా పనిచేస్తే సెంథిల్‌కుమార్‌ను ఫిబ్రవరి 2న ఓ యువకుడు తలపై బండరాయి మోది హత్య చేసేందుకు యత్నించాడు. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో చనిపోయాడేమో అనుకుని అతడి వద్దనున్న వెయ్యి రూపాయిలు తీసుకుని పారిపోయాడు. Also read: తెల్లవారుజామున సెంథిల్‌కుమార్‌‌ను గుర్తించిన స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీ పరిశీలించి నిందితుడిని పుదుకోట్టైకి చెందిన రాజేశ్‌కుమార్‌గా గుర్తించారు. అతడి అరెస్ట్ చేసి విచారించగా అనేక విషయాలు బయటపడ్డాయి. రాజేశ్‌ గతంలోనూ అనేక చోరీలకు పాల్పడ్డాడని, సేలం, అస్తంపట్టి ప్రాంతాల్లో ముగ్గురు వాచ్‌మెన్లను ఇలాగే చంపేశాడని వెల్లడైంది. Also read: తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో రాజేష్‌కుమార్‌ తండ్రి సంరక్షణలో జులాయిగా పెరిగాడు. నాలుగు నెలల క్రితం తండ్రి కూడా కాలం చేయడంతో అనాథగా మారాడు. గంజాయికి అలవాటు పడిన అతడు డబ్బు కోసం నేరాల బాట పట్టాడు. చోరీలకు పాల్పడిన సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చంపేసేశాడు. 2015లో భిక్షాటన చేసే వృద్ధురాలిని హతమార్చి రూ.300 నగదు తీసుకున్నట్లు విచారణలో రాజేశ్‌ అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. తిరుచ్చిలో ఓ హత్య, సేలంలోనూ ముగ్గురిని హత్యచేసి రూ.700, రూ.1000, రూ.400 నగదును అపహరించినట్లు చెప్పాడు. 2009లోనూ నాలుగేళ్ల బాలుడిని హత్య చేసి అతడి మెడలోని వెండి గొలుసును చోరీ చేశాడు. వాచ్‌మెన్‌పై హత్యాయత్నం కేసులో అరెస్టయిన రాజేశ్‌కుమార్ చెప్పిన వివరాలు విన్న పోలీసులు షాక్‌కు గురయ్యాడు. అతడు మరిన్ని నేరాలకు పాల్పడ్డాడా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. Also read:


By March 08, 2020 at 12:58PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-arrested-in-tamilnadu-he-kills-5-persons-for-money/articleshow/74535739.cms

No comments