Breaking News

మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ తప్పదా ? మోదీ ఏమంటున్నారు ?


నేపథ్యంలో ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ నడుస్తొంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా బయటకు వస్తే... పోలీసులు వారిపై యాక్షన్ తీసుకుంటున్నారు. అత్యవసర సేవలు అందించేవారు మినహాయించి మిగతా ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. సామాజిక దూరం పాటిస్తున్నారు. అన్ని సంస్థలు మూసివేశారు. సమావేశాల్ని రద్దు చేశారు. పెళ్లిల్లు, ఫంక్షన్లు అన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఇదే పరిస్థితి మరో 15 రోజుల వరకు తప్పదేమోనని ప్రధాని మోదీ అన్నట్లు తెలుస్తోంది. సోమవారం లోక్ సభ ముగిసిన తర్వాత స్పీకర్ చాంబర్లో మోదీని పలువురు పార్టీల నేతలు కలిశారు. ఎన్నాళ్లు ఈ దిగ్బంధం ఉంటుందని కొందరు నేతలు ప్రధానిని ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీంతో సమాధానం ఇస్తూ మరో 15 రోజుల్లో అంతా సజావుగా మారవచ్చని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైరస్‌ వల్ల జరిగిన నష్టాన్ని పూరించేందుకు ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి మోదీని కోరారు. దీనిపై పరిశీలిస్తున్నామని ప్రధాని జవాబిచ్చినట్లు తెలిసింది. లాక్‌డౌన్‌ ను ప్రజలు సీరియ్‌సగా తీసుకోవడం లేదని సోమవారం ట్వీట్‌లో ప్రధాని ఆక్షేపించారు. ప్రజలంతా లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ను మరింత సీరియ్‌స గా అమలు చేయాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు పంపారు. మరోవైపు దేశమంతా లాక్ డౌన్ నడుస్తుంది. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ప్రకటించాయి. ఈనెల 31 వరకు అత్యవసర సేవల మినహా అన్నింటిని బంద్ చేస్తున్నట్లు తెలిపాయి. మరికొన్ని రాష్ట్రాలు... తమ సరిహద్దుల్ని కూడా సీల్ చేశాయి. ఏ వాహనాల్ని కూడా రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. దీంతో ఎక్కడ చూసిన కర్ఫ్యూ వాతావరణమే కనిపిస్తోంది.


By March 24, 2020 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/govt-planning-to-extend-lockdow-in-indian/articleshow/74784954.cms

No comments