Breaking News

కరోనా కల్లోలం: 13 వేలు దాటిన మృతులు.. ఇటలీలో కొనసాగుతోన్న మరణ మృదంగం


ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రస్తుతం 188 దేశాలకు విస్తరించి, పంజా విసురుతోంది. 1918లో విజృంభించిన ఫ్లూ కంటే కరోనా వైరస్ ప్రమాదికారిగా మారిందని నిపుణులు అంటున్నారు. ఈ మహమ్మారికి ఇప్పటి వరకూ ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో తెలియక ప్రపంచం ఆందోళన చెందుతోంది. వివిధ దేశాలు కరోనా వైరస్‌ను కట్టడిచేయడానికి ప్రయత్నిస్తున్నా మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 13,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1,600 మంది మృతిచెందారు. వైరస్ బారినపడ్డవారిలో దాదాపు 95 వేల మందికిపైగా కోలుకున్నారు. మరో 1,89,000 మంది పరిస్థితి నిలకడగా ఉండగా, 9,300 మంది పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఇటలీలో కరోనా కరళానృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు ఆ దేశంలోని వయోధికులు మొత్తం తుడిచిపెట్టుకుపోతోంది. ఇటలీలో వైరస్ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం దాదాపు 800 మంది మృతిచెందగా .. మరణాల సంఖ్య 4,800 దాటేసింది. కొత్త కేసులు కూడా ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం నాటితో పోల్చితే శనివారం మరో 6,557 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 53,57కి చేరింది. ఉత్తర ఇటలీలోని లొంబార్డే ప్రాంతంలోనే అత్యధికంగా చోటుచేసుకుంటున్నాయి. వైరస్‌కు మూలకేంద్రమైన చైనాలో శనివారం కొత్తగా 46 కేసులు నమోదు కాగా, ఆరుగురు మాత్రమే చనిపోయారు. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 3,261కు చేరుకోగా, బాధితుల సంఖ్య 81,054గా నమోదయ్యింది. స్పెయిన్‌లో 1378 మంది, ఇరాన్‌లో 1,556, ఫ్రాన్స్‌లో 562 మంది, అమెరికాలో 340, బ్రిటన్ 233, నెదర్లాండ్ 136, దక్షిణ కొరియా 104, జర్మనీ 84, స్విట్జర్లాండ్‌లో 80 మంది మృతిచెందారు. అమెరికాలోనూ కోవిడ్ శరవేగంగా విస్తరిస్తోంది. శనివారం అత్యధికంగా 7,300పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 27వేలకు చేరుకోగా, శనివారం మరో 84 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరో ఐదు రాష్ట్రాల్లో అమెరికా లాక్‌డౌన్ ప్రకటించింది. ఐరోపా దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆంక్షల కూడా అంతేతీవ్రంగానే ఉంది. ఇటలీలో వైరస్‌ ఓ స్థాయిలో విరుచుకుపడుతుండటంతో ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్ని మూసివేసి, ప్రజల్ని క్వారంటైన్‌లో ఉండాలని కోరాయి. పోలెండ్‌లో కూడా ఇదే తరహాలో ఆదేశాలు జారీ చేశారు. అయితే వారు క్వారంటైన్‌లో ఉన్నట్లు నిరూపించుకోవాలని ఆదేశించారు. దీని కోసం ‘హోం క్వారంటైన్‌’ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. ప్రజలు దీన్ని తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇంట్లో ఉండి ఎప్పటికప్పుడు తమ సెల్ఫీలు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ సమాచారం స్థానిక అధికారుల వద్దకు వెళుతుంది. దాన్ని వారు ధ్రువీకరిస్తారు.


By March 22, 2020 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/globally-more-than-3-lakh-people-are-infected-and-over-13000-have-died-due-to-covid-19/articleshow/74755263.cms

No comments