Breaking News

TDP చీఫ్ చంద్రబాబును కలిసిన జయసుధ


వైఎస్సార్సీపీ మహిళా నేత, సినీ నటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడ్ని కలిశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆమె.. తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. తప్పనిసరిగా తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని ఆమె కోరారు. జయసుధ వెంట ఆమె సోదరి సుభాషిణి కూడా బాబు నివాసానికి వెళ్లారు. జయసుధకు నిహార్ కపూర్, శ్రీయాన్ కపూర్ అని ఇద్దరు కుమారులున్నారు. ఫిబ్రవరి 26న నిహార్ కపూర్ ఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్‌ను వివాహం చేసుకోనున్నారని సమాచారం. ఆమె భర్త నితిన్ కపూర్ 2017లో చనిపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జయసుధ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పని చేశారు. చాలా కాలంపాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆమె.. చంద్రబాబు సీఎం అయ్యాక టీడీపీలోకి వెళ్లారు. గత ఎన్నికల ముందు ఆమె టీడీపీని వీడి జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.


By February 17, 2020 at 11:44AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ysrcp-leader-jayasudha-meets-tdp-chief-chandrababu-naidu-to-invite-him-for-her-sons-wedding/articleshow/74169864.cms

No comments