Breaking News

కరీంనగర్‌లో విషాదం.. బైక్ కాల్వలోకి దూసుకెళ్లి భార్య మృతి.. ఆస్పత్రిలో భర్త


జిల్లాలో వరుస ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆదివారం ఉదయం కరీంనగర్‌- హైదరాబాద్‌ రహదారి మానేరు వంతెన కారు అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో భర్త చనిపోగా.. భార్య తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటన మరువకముందే అదివారం సాయంత్రం తిమ్మాపూర్‌ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాకతీయ కాలువలోకి బైక్ దూసుకెళ్లిన ఘటనలో భార్య చనిపోగా.. భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. Also Read: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్‌, కీర్తన(27) దంపతులు హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. ఓ శుభకార్యం నిమిత్తం వీరిద్దరు శనివారం కరీంనగర్‌కు వచ్చారు. శుభకార్యం ముగిసిన తర్వాత ఆదివారం రాత్రి తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో గల శ్రీ తాపాల లక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో అల్గునూర్‌ కాకతీయ కాల్వ వద్దకు చేరుకోగానే ప్రదీప్‌ కంట్లో పురుగులు పడడంతో బైక్ అదుపుతప్పి కాకతీయ కాలువలోకి దూసుకెళ్లింది. Also Read: అదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కోసం వెళ్తున్న ఎల్‌ఎండీ బ్లూకోట్‌ సిబ్బంది ప్రదీప్‌ అరుపులు విని వెంటనే ఎల్‌ఎండీ ఎస్ఐ నరేష్‌ రెడ్డికి సమాచారం అందించారు.ఆయన తన సిబ్బందితో అక్కడికి చేరుకుని తాడు సాయంతో ప్రదీప్‌ను బయటకు తీసి తమ వాహనంలోనే కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. నీటిలో కొట్టుకుపోయిన కీర్తన కోసం పోలీసులు, ఆమె కుటుంబసభ్యులు వెతకగా అర్ధరాత్రి వేళ ముంజంపల్లి శివారులో మత్స్యకారుల వలకు మృతదేహం చిక్కుకొని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కీర్తన మరణంతో ఆమె కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. Also Read:


By February 17, 2020 at 11:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-killed-in-accident-due-to-bike-fell-in-kakatiya-canal-in-karimnagar-district/articleshow/74169785.cms

No comments