Breaking News

గుంటూరు జిల్లాలో దారుణం.. ఐదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి రేప్


జిల్లా పట్టణంలో దారుణ ఘటన వెలుగుచూసింది. అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న ఐదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: ఐదేళ్ల చిన్నారి మూడు రోజుల క్రితం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లొస్తుండగా ఇంటర్ విద్యార్థి ఆమెకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక దాడికి పాల్పడి ఏమీ ఎరుగనట్లుగా ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. అదేరోజు సాయంత్రం బాలిక కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. బాలికపై మర్మాంగాల్లో రక్తస్రావమైనట్లు గుర్తించిన డాక్టర్ ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించి తల్లిదండ్రులకు చెప్పాడు. Also Read: దీంతో షాకైన బాలిక పేరెంట్స్ వెంటనే పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి ఆదివారం అరెస్ట్ చేశారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. Also Read:


By February 17, 2020 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/inter-student-rapes-5-yr-old-girl-in-guntur-distirct/articleshow/74169413.cms

No comments