Chandrababu Naidu: బాబు సొంతూరిలో వైసీపీ దూకుడు.. తగ్గేది లేదంటోన్న టీడీపీ!

రాజధాని అంశం ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. రాజధానిని తరలించొద్దంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేపడుతుండగా.. టీడీపీ దీనికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగతా ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రాజధాని వికేంద్రీకరణ విషయంలో బాబును టార్గెట్ చేసిన అధికార పార్టీ.. ఆయన సొంతూరు నారావారిపల్లో నేడు (ఆదివారం) భారీ సభను నిర్వహిస్తోంది. మూడు రాజధానులకు మద్దుతుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాజధానులను మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్నామని.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలకు తెలపడం కోసమే ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. తొలి సభ నారావారిపల్లెలో నిర్వహించడం వెనుక రాజకీయ కారణాలేవి లేవన్నారు. చంద్రబాబు నాయుడి సొంతూరు, టీడీపీకి కంచుకోట లాంటి నారావారిపల్లెలో వైఎస్సార్సీపీ బహిరంగ సభ నిర్వహించడాన్ని ప్రతిపక్ష పార్టీ సీరియస్గా తీసుకోంది. మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్సీపీ సభ నిర్వహిస్తుండగా.. అదే సమయంలో టీడీపీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తోంది. భారీగా జనసమీకరణపై ఫోకస్ పెట్టింది. కాగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర టీడీపీ చేపట్టే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
By February 02, 2020 at 10:43AM
No comments