Breaking News

తిరుపతిలో నలుగురికి కరోనా లక్షణాలు.. ‘రుయా’ నిర్లక్ష్యం, సర్కారు సీరియస్!


చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. జనవరి 18న ఓ కుటుంబం చైనా నుంచి పీలేరు తిరిగొచ్చింది. వారు వుహాన్‌కు 8 గంటల ప్రయాణ దూరంలో చైనాలో నివసించారు. కరోనా వైరస్ అనుమానంతో వైద్యపరీక్షల కోసం వారు రుయా హాస్పిటల్‌కు వచ్చారు. ఐసోలెటెడ్ వార్డులో వీరిని ఉంచి చికిత్స అందించాల్సింది పోయి.. డాక్టర్లు వారిని ఔట్ పేషెంట్ విభాగంలో పర్యవేక్షించి వదిలేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంలో హాస్పిటల్ వర్గాలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలసత్వం వహించాయి. ఈ విషయమై మీడియాలో కథనాలు రావడంతో జగన్ సర్కారు ఆరాతీసింది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం, ఐసొలేటెడ్ వార్డులో చేర్చుకోకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. హాస్పిటల్ వర్గాలు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తిరుపతి విమానాశ్రయంలో రెండు కరోనా స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనుమానితులను నేరుగా విమానాశ్రయం నుంచి హాస్పిటల్‌కు పంపించి ఐసొలేటెడ్ వార్డుల్లో చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు.


By February 02, 2020 at 11:19AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/family-returned-from-china-went-to-ruia-hospital-tirupati-for-coronavirus-test-but-not-admitted-in-isolated-ward/articleshow/73864589.cms

No comments