Breaking News

అర్థరాత్రి ఒంటరి యువతిపై కీచక పర్వం.. ఏలూరులో మరో దిశ కేసు


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కామాంధుడు రెచ్చిపోయాడు. అర్ధరాత్రి బస్సు దిగి ఇంటికి వెళ్తున్న యువతిని లైంగికంగా వేధించాడు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు వెంటనే డయల్ 112కి ఫోన్ చేయడంతో క్షణాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపలోకి తీసుకున్నారు. ఆ కామాంధుడిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే ఓ మహిళ ఉద్యోగిని బస్సులో వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి దిశ చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే దిశ చట్టం కింద నమోదైన తొలి కేసు అది. ఇప్పుడు రెండో కేసు కూడా ఏలూరులోనే నమోదు కావడం గమనార్హం. Also Read: వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన యువతి ఓ షాప్‌లో పనిచేస్తోంది. శనివారం విధులు ముగించుకుని 11 గంటల సమయంలో ఇంటికి వెళ్తోంది. తాను ఉండే ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో నవాబ్‌పేటకు చెందిన రుప్పా మురళి అనే యువకుడు ఆమెను వెంబడించి అసభ్య పదజాలంతో వేధించాడు. ఆమెను పక్కకు లాక్కెళ్లి లైంగికదాడికి యత్నించాడు. Also Read: దీంతో భయపడిపోయిన యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడి మురళిని పట్టుకున్నారు. బాధితురాలు వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేయగా కొద్ది నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతడిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By February 16, 2020 at 09:30AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/eluru-police-booked-another-disha-case-on-man-over-sexual-harassment-on-young-woman/articleshow/74156902.cms

No comments