‘పెళ్లన్నాడు.. సహజీవనం చేసి వదిలేశాడు’.. ప్రియుడి ఎదుట యువతి ధర్నా


ప్రేమించి పెళ్లి పేరుతో లొంగదీసుకుని మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా చేపట్టిన ఘటన జిల్లా తిరుపతిలోని శనివారం చోటుచేసుకుంది. రూరల్ మండల అవిలాలకు చెందిన యువతి(19) పీలేరు జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడు.. తిరుపతి కొర్లగుంట సమీపం నవోదయనగర్కు చెందిన చంద్రమౌళితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకే అదికాస్తా ప్రేమగా మారింది. Also Read: బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగంలో చేరిన చంద్రమౌళి కొద్ది రోజుల తర్వాత యువతిని తీసుకెళ్లి సహజీవనం చేశాడు. మైనారిటీ తీరిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి ఆమెను ఇంటికి పంపేశాడు. ఆరు నెలలుగా ప్రియుడి నుంచి సమాచారం రాకపోవడంతో యువతి మోసపోయానని గ్రహించి ఇటీవలే తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోవంలేదంటూ శనివారం నవోదయనగర్లోని ప్రియుడి ఇంటి ముందు మహిళా సంఘాలతో కలిసి నిరసన దీక్షకు దిగింది. Also Read: బెంగళూరులో ఉన్న ప్రియుడు వచ్చేవరకు అక్కడి నుంచి కదలబోనని, తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు చెబుతోంది. సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పీఎస్ సీఐ శివప్రసాద్రెడ్డి ఇరువర్గాలను స్టేషన్కు రప్పించి మాట్లాడారు. ప్రియుడితో పెళ్లి చేస్తేనే ఆందోళన విరమిస్తానని యువతి తేల్చిచెప్పింది. మరోవైపు ప్రియుడి తండ్రి కువైట్లో ఉంటున్నారు. ఇంట్లో అతడి తల్లి, అన్న మాత్రమే ఉన్నారు. పెద్దకుమారుడికి పెళ్లి కాకుండా తమ్ముడికి ఎలా పెళ్లి చేస్తామని చంద్రమౌళి తల్లి పోలీసులను ప్రశ్నించింది. ఈ వివాదం ఎటూ తేలకపోవడంతో తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By February 16, 2020 at 09:05AM
No comments