ఆరేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకుల అఘాయిత్యం.. విశాఖలో దారుణ ఘటన
ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పిన ఇద్దరు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన విశాఖ జిల్లాలో వెలుగుచూసింది. పరవాడ సమీపంలోని ముత్యాలమ్మపాలెం పంచాయతీ పరిధి తిక్కవానిపాలెంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. Also Read: గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి స్థానికంగా ఓ పాఠశాలలో ఎల్కేజి చదువుతోంది. శనివారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలిక సాయంత్రం వేళ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బాలికను మాటల్లోకి దించారు. చాక్లెట్లు కొనిస్తామని మాయమాటలు చెప్పి పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారు. బాలిక పెద్దగా ఏడవడంతో స్థానిక మహిళలు కొందరు అక్కడికి చేరుకుని ఆ కామాంధులను పట్టుకుని చితకబాదారు. Also Read: ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. నిందితులిద్దరూ వివాహితులని, మద్యం మత్తులోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. వైజాగ్ సౌత్ ఏసీపీ రామాంజనేయులరెడ్డి పరవాడ స్టేషన్కు చేరుకుని నిందితులను విచారించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By February 16, 2020 at 09:48AM
No comments