Breaking News

‘వాడి కోరికలు తీర్చలేక చచ్చిపోతున్నా’.. కోనసీమ యువతి సూసైడ్‌ నోట్‌లో షాకింగ్ విషయాలు


జిల్లా మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 12న ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. యువతి సూసైడ్ నోట్‌లో పేర్కొన్న విషయాలతో ఈ కేసును ఓ కొలిక్కి తెస్తున్నారు. ఓ యువకుడి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు... చనిపోయే ముందు తల్లికి యువతి రాసిన లేఖను పోలీసులు శనివారం బయటపెట్టారు. Also Read: ‘అమ్మా నేను ఏ తప్పూ చేయలేదు.. నాకు బతకాలని ఉన్నా వాడు బతకనివ్వట్లేదు.. తన రూమ్‌కి వచ్చి కోరికలు తీర్చాలని వేధిస్తున్నాడు. మాట వినకపోతే ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పలేక చచ్చిపోతున్నా. వాడిని ఏమీ చేయొద్దు. ఆ ఫోటోలు బయటపెడితేనే నా ఆత్మకు శాంతి. ఐ మిస్ యూ అమ్మా’ అంటూ యువతి లేఖలో పేర్కొంది. Also Read: ఈ లేఖ ఆధారంగా పోలీసులు కేసు చేధించే పనిలో పడ్డారు. తనను వేధిస్తున్న యువకుడు ఎవరో యువతి లేఖలో చెప్పకపోవడంతో అతడిని గుర్తించడం కష్టంగా మారింది. అయినప్పటికీ వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేస్తామని ఎస్ఐ సురేశ్ తెలిపారు. యువతి చావుకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. Also Read:


By February 23, 2020 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sakhinetipalli-police-reveals-shocking-details-in-woman-suicide-case/articleshow/74263202.cms

No comments