Breaking News

ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ హతం


దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు నేరస్థులు హతమయ్యారు. పలు హత్యలు, ఇతర నేరాలతో సంబంధం ఉన్న కరడుగట్టిన నేరస్థులను ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు హతమార్చారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దర్నీ రాజా రఫీక్ ఖురేషి, రమేష్‌ బహదూర్‌లుగా గుర్తించారు. కరావల్‌నగర్‌ హత్యోదంతం సహా సహా పలు కేసుల్లో రఫీక్ ఖురేషీ, రమేశ్‌ల కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. రెండు రోజుల కిందట కరావల్ నగర్‌లో ఓ స్థిరాస్తి వ్యాపారి షాపుపై కాల్పులు జరిపిన రఫీక్.. తనను కలవడానికి వెళ్లిన దుకాణ యజమాని, ఇద్దరు పోలీసులను గాయపరిచాడు. తర్వాత లోనీ ప్రాంతానికి వెళ్లిన రఫీక్.. మరో స్థిరాస్థి వ్యాపారిని కాల్చి చంపాడు. సోమవారం ఉదయం 5.00 గంటల ప్రాంతంలో ప్రహ్లాద్‌పూర్‌లోని తుగ్లాకాబాద్ బ్రిడ్జ్ వద్ద ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు, నేరస్థుల మధ్య 30 రౌండ్లు కాల్పులు జరిపినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కాల్పుల అనంతరం తీవ్రంగా గాయపడిన వీరిని హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం పోలీసులకు పెద్ద విజయం. ఈ ఎన్‌కౌంటర్‌తో ప్రహ్లాద్‌పూర్ ప్రాంతంలో నేరాలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు.


By February 17, 2020 at 11:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cops-killed-two-most-wanted-criminals-in-encounter-in-south-delhi/articleshow/74169425.cms

No comments